రియల్మీ తన కొత్త స్మార్ట్ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 32 అంగుళాల స్క్రీన్ను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,920x1,080 పిక్సెల్స్గా ఉంది. 24W సౌండ్ అవుట్పుట్ను ఇవి అందించనున్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. హెచ్డీఆర్ ఫార్మాట్ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని ధరను రూ.18,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్, రియల్మీ, ఎంపిక చేసిన ఆఫ్లైన్ స్టోర్లలో జూన్ 29వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. దీనిపై పలు లాంచ్ ఆఫర్లు కూడా అందించనున్నారు. రియల్ మీ తన మొదటి స్మార్ట్ టీవీలను 2020లో లాంచ్ చేసింది. ఇప్పుడు వీటికి తర్వాతి వెర్షన్గా రియల్మీ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్డీ 32 లాంచ్ అయింది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,920x1,080 పిక్సెల్స్గా ఉంది. సాధారణంగా 32 అంగుళాల టీవీల్లో హెచ్డీ డిస్ప్లేనే అందిస్తారు. కానీ ఇందులో ఫుల్ హెచ్డీ డిస్ప్లే అందుబాటులో ఉంది. దీని కారణంగా ఈ టీవీలో పిక్చర్ మరింత క్వాలిటీగా ఉండనుంది. ఆండ్రాయిడ్ టీవీ 9 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. గూగుల్ ప్లేస్టోర్కు యాక్సెస్, ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ను ఇన్బిల్ట్గా ఇందులో అందించారు. హెచ్ఎల్జీ, హెచ్డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో అందించారు. హైడైనమిక్ రేంజ్ కంటెంట్ వ్యూయింగ్ను కూడా ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. 24W సౌండ్ అవుట్పుట్ను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూఢా ఇందులో ఉంది. క్రోమ్ బూస్ట్ పిక్చర్ ఇంజిన్ ఫీచర్ను కూడా ఈ టీవీలో అందించారు. 85 శాతం ఎన్టీఎస్సీ కలర్ రిప్రొడక్షన్ కూడా ఇందులో ఉంది.
0 Comments