తెలుగులో వచ్చిన నాలుగు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో ఐదో సీజన్పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్వాహకులు. వాస్తవానికి బిగ్బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్లో ఈ షోని ప్రారంభించాలని నిర్వాహకులు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రతి సీజన్ లానే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ మీద కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్లో యాంకర్లు వర్షిణి, రవి,శివ, ప్రత్యూష, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, టిక్టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
Search This Blog
Saturday, July 31, 2021
బిగ్బాస్ డేట్ ఫిక్స్ ?
తెలుగులో వచ్చిన నాలుగు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో ఐదో సీజన్పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్వాహకులు. వాస్తవానికి బిగ్బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్లో ఈ షోని ప్రారంభించాలని నిర్వాహకులు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రతి సీజన్ లానే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ మీద కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్లో యాంకర్లు వర్షిణి, రవి,శివ, ప్రత్యూష, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, టిక్టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇవి తింటే డయాబెటీస్ దూరం !
రోజువారీ ఆహారంలో భాగంగా మిల్లెట్లను తీసుకునే మధుమేహం ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 12-15 శాతం (ఉపవాసం, భోజనం తర్వాత) తగ్గుతాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మధుమేహం రావడానికి ముందు స్థాయికి చేరుకున్నాయని అధ్యయనం వెల్లడించింది. ప్రీ-డయాబెటిక్ వ్యక్తులకు HbA1c (బ్లడ్ గ్లూకోజ్ బౌండ్ హిమోగ్లోబిన్) స్థాయిలు సగటున 17 శాతం తగ్గాయి. ఈ స్థాయిలు డయాబెటిక్ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నాయి.
'ఎ సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా-అనాలిసిస్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ మిల్లెట్స్ ఫర్ మేనేజింగ్ అండ్ రెడ్యూసింగ్ ది రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటిస్ మెల్లిటస్” అనే శీర్షికతో అధ్యయనం 'ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్' లో ప్రచురితమైంది. ఈ అధ్యయనాన్ని భారతదేశం, జపాన్, మలావి, యునైటెడ్ కింగ్డమ్తోపాటు 11 దేశాల్లో నిర్వహించారు. నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ అంశాల్లో వివిధ ఫలితాలపై మిల్లెట్ల ప్రభావంపై 80 అధ్యయనాలను పరిశోధకులు సేకరించారు. వీటిలో దాదాపు 1,000 మానవ విషయాలతో కూడిన మెటా-విశ్లేషణకు 65 మంది అర్హులుగా గుర్తించారు. ఈ సమీక్ష 2017 అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు జరిగింది.
మిల్లెట్స్ 52.7 యొక్క తక్కువ సగటు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ), మిల్లింగ్ రైస్, రిఫైన్డ్ గోధుమలతో పోలిస్తే 30 శాతం తక్కువ జీఐని కలిగిఉన్నది. మొక్కజొన్నతో పోలిస్తే దాదాపు 14-37 జీఐ పాయింట్లు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు కనుగొన్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారం గురించి తెలియజేస్తుంది. ఉడకబెట్టడం, బేకింగ్ చేయడం, ఆవిరి పట్టడం తర్వాత కూడా చిరుధాన్యాల్లో బియ్యం, గోధుమ. మొక్కజొన్న కంటే తక్కువ జీఐ ఉన్నదని తేల్చారు.
అయితే, ఫలితాలను రాబట్టడానికి ప్రజలు ఎంతకాలం మిల్లెట్లను తినాలి? అనే ప్రశ్న ఉద్భవిస్తున్నది. ఫలితాలను చూడటానికి నిర్దిష్ట కాల వ్యవధిని పేర్కొనలేదని, ప్రజలు జంక్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్స్కి తిరిగి వెళ్తే ఫలితాలు ఇలాగే ఉండవు' అని అధ్యయనం ప్రధాన రచయిత, ఇక్రిశాట్ సీనియర్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ అనిత సూచించారు. భారతదేశంలో 1990-2016 వరకు మధుమేహం చాలా ఎక్కువ వ్యాధి భారం కలిగించడానికి దోహదపడిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) డైరెక్టర్ డాక్టర్ హేమలత చెప్పారు.
వ్యవసాయంలో వైవిధ్యం అనేది వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు నష్టాన్ని తగ్గించే వ్యూహం. అయితే ఆన్-ప్లేట్ వైవిధ్యం మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పోషకాహార లోపం, మానవ ఆరోగ్యం, సహజ వనరుల క్షీణత, వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్లను తగ్గించే పరిష్కారంలో మిల్లెట్లు భాగం. బహుళ భాగస్వాములతో కూడిన ట్రాన్స్-డిసిప్లినరీ పరిశోధన స్థితిస్థాపకమైన, స్థిరమైన, పోషకమైన ఆహార వ్యవస్థలను సృష్టించడానికి అవసరం' అని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్ పేర్కొన్నారు.
రూ.100 లోపు ప్లాన్స్పై ఎస్ఎమ్ఎస్ ల రద్దు
అన్ని ప్రముఖ మొబైల్ నెట్వర్క్లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ ప్లాన్లను రద్దు చేస్తూ యూజర్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఎయిర్టెల్ తన ఎంట్రీ లెవల్ రూ. 49 ప్లాన్ను రద్దు చేసి దాని స్థానంలో రూ. 79 ప్లాన్ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్, జియో సంస్థలు కూడా ఎంట్రీ లెవల్ ప్లాన్ల కింద లభించే బెనిఫిట్స్ తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. రూ. 100లోపు లభించే ప్లాన్లపై ఉచిత బండిల్ ఎస్ఎమ్ఎస్లను రద్దు చేసే ప్లాన్లో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని టెలికాం ఆపరేటర్లు దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇవి అమల్లోకి వస్తే ఇకపై ఎంట్రీ లెవల్ ప్లాన్లపై ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందలేరు. ప్రస్తుతం అన్ని టెలికాం ఆపరేటర్లు ఎంట్రీ లెవల్ ప్యాకేజీల్లో భాగంగా తక్కువ ధర వద్దే ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాలింగ్. ఎస్ఎమ్ఎస్తో కూడిన బండిల్ ప్యాకేజీని అందిస్తున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో ఈ బండిల్ ప్యాక్కింద ఉచిత ఎస్ఎమ్ఎస్ ఫెసిలిటీని తొలగించనున్నాయి. ఇప్పటికే, ఎయిర్టెల్ ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఎయిర్టెల్ ఇటీవల రూ. 49 విలువల గల ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ను రద్దు చేసి దాని స్థానంలో రూ. 79 ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 64 టాక్టైమ్, 200MB డేటా అందిస్తుంది.
ఎయిర్టెల్ మరో ఎంట్రీ లెవర్ ప్లాన్ రూ. 64 కింద 28 రోజుల పాటు 200MB డేటా మాత్రమే ఇస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ ఉచిత ఎస్ఎమ్ఎస్ ఆప్షన్ను తొలగించడం గమనార్హం. ఒకవేళ, యూజర్లు ఎస్ఎమ్ఎస్ చేయాలనుకుంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే తరహాలో జియో కూడా ఇటీవల తన ఎంట్రీ లెవల్ రూ. 98 ప్లాన్లో మార్పులు చేసింది. ఈ ప్లాన్ కింద మొత్తం 14 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 1.5GB డేటా మాత్రమే వస్తుంది. దీనిలో ఎటువంటి ఉచిత ఎస్ఎమ్ఎస్లు లభించవు.
వొడాఫోన్ ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ .49 వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ కింద 28 రోజుల పాటు 100 జీబీ డేటా, రూ .38 టాక్ టైమ్ మాత్రమే అందిస్తుంది. దీని కింద ఎటువంటి ఉచిత ఎస్ఎమ్ఎస్లు లభించవు. కాగా, ప్రస్తుతం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోవడంతో ఎస్ఎమ్ఎస్ ద్వారా మొబైల్ నంబర్ ధ్రువీకరణ కూడా కీలకమైంది. దీంతో ఎస్ఎమ్ఎస్ల కోసం వినియోగదారులు అధిక ధరతో కూడిన ప్లాన్లను ఎంచుకుంటారని టెలికాం సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఎంట్రీ లెవల్ ప్లాన్లలో ఎస్ఎమ్ఎస్లను తొలిగించాయి.
ఆన్ లైన్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్
ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్ టి ఓ ఆఫీస్ వద్దకు వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీని కోసం సులువైన కొత్త పద్దతిని తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకోచ్చిన కొత్త నియమాల ప్రకారం, మీరు ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవచ్చు. లెర్నర్స్ తమ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు ఈ కేంద్రాలలో డ్రైవింగ్ టెస్ట్ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించగలిగితే, ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.
ఆర్టీఓవద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా, ఆన్లైన్ టెస్ట్ కోసం హాజరుకావాలి.
ఆన్లైన్ టెస్ట్ ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది, భారతీయ రహదారి రంగంలో మంచి డ్రైవర్ల కొరత కారణంగా కొత్త నిబంధనలు అమలు చేయబడ్డాయి,
డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో లొసుగులను తగ్గించడానికి దరఖాస్తుదారుల ఆన్లైన్ పరీక్ష అమలు చేయబడుతోంది.
ఆన్లైన్ డ్రైవింగ్ ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే సమర్థవంతంగా ఉంటుందని భావిస్తున్నారు,
డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది.
డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిగ్గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.
Thursday, July 29, 2021
MI MIX 4 డిజైన్ లీక్ అయింది
ఫ్లాగ్షిప్ Mi MIX 4 స్మార్ట్ఫోన్ పై షియోమి పనిచేస్తోంది. దీనిలో కంపెనీ అండర్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ పరికరాన్ని రాబోయే నెలల్లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మరియు కొన్ని ఇతర హై-ఎండ్ ఫీచర్లతో ప్రారంభించవచ్చు. సూచించిన హ్యాండ్సెట్ ఇప్పుడు TENAA ద్వారా దాని ధృవీకరణను క్లియర్ చేసింది. కొన్ని హార్డ్వేర్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. షియోమి Mi MIX 4 ను టెనా సర్టిఫికేషన్ వెబ్సైట్లో M2016118C మోడల్ నంబర్తో గుర్తించారు. పరికరం ఇంతకుముందు అదే మోడల్ సంఖ్యను కలిగి ఉన్న 3 సి మొబైల్ ప్రామాణీకరణ వెబ్సైట్ను సందర్శించింది. ముఖ్యంగా, టెనా లిస్టింగ్ మి మిక్స్ 4 స్మార్ట్ఫోన్ యొక్క రెండు వేరియంట్లను సూచించింది.ఈ వేరియంట్లలో ఒకటి 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో లాంచ్ చేయగా, రెండోది 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్తో వస్తాయని చెబుతున్నారు. TENAA జాబితా ప్రస్తుతం RAM మరియు నిల్వ ఆకృతీకరణలను మాత్రమే వెల్లడించింది. రాబోయే వారాల్లో మిగిలిన స్పెసిఫికేషన్లతో జాబితాను విడుదల చేయనున్నారు. ఈ హ్యాండ్సెట్ యొక్క కొన్ని లక్షణాలు తెలుసు. వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
షియోమి Mi MIX 4 స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్తో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. కొన్ని నివేదికలు హ్యాండ్సెట్ అప్గ్రేడ్ చేసిన స్నాప్డ్రాగన్ 888 ప్లస్ SoC ని ఉపయోగించవచ్చని సూచిస్తున్నాయి. TENAA లిస్టింగ్ లో ఇప్పటికే 12GB RAM మరియు 512GB నిల్వ సామర్థ్యాన్ని నిర్ధారించింది. ఇది ఆండ్రాయిడ్ 11 OS తో రవాణా చేయబడవచ్చు, ఇది కస్టమ్ MIUI ఇంటర్ఫేస్ తో విడుదల కానుంది. ప్రాధమిక సెన్సార్ 50 MP శామ్సంగ్ GN1 సెన్సార్తో ఈ హ్యాండ్సెట్ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇతర కెమెరా లక్షణాలు ఇప్పటికి బయటపడలేదు. కానీ, త్వరలో వివరాలను పొందవచ్చు.
అంచనాల ప్రకారం, MI Mix 4 లో వక్ర అంచు డిస్ప్లే కూడా సూచించింది. డిస్ప్లే 6.6-అంగుళాలు గా చేయబడింది. మరియు ఇది OLED ప్యానెల్ తో వస్తుంది. ఈ పరికరం FHD + రిజల్యూషన్ తో ఉంటుంది. డిస్ప్లే భద్రత కోసం వేలిముద్ర స్కానర్ను కలిగి ఉంటుంది. అండర్ డిస్ప్లే కెమెరా సెటప్ను కూడా చూడవచ్చు. ఏదేమైనా, కంపెనీ టీజర్లను వదిలివేసిన తర్వాత ఇది స్పష్టమవుతుంది. ఏదేమైనా, ఈ సంవత్సరం ఆగస్టులో ఈ పరికరం మార్కెట్లోకి రావొచ్చని అంచనా వేస్తున్నాము.
ఎయిర్టెల్ రూట్లోనే వొడాఫోన్ ఐడియా!
వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ కూడా ఎయిర్టెల్ రూట్లోనే వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే కొత్త ప్లాన్లు అమలు చేస్తున్న వొడాఫోన్ ఐడియా.. త్వరలోనే దేశమంతా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎంట్రీ లెవెల్ ప్లాన్లను ఎక్కువ మొత్తానికి పెంచేయనుంది. ప్రస్తుతానికి మొబైల్ వినియోగదారుల్లో 90 శాతం మంది ప్రీపెయిడ్ వాడే వారే ఉన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్లాన్స్ వల్ల ఆర్థిక భారం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంలో టెలికాం సంస్థలు ఉన్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్లాన్లతో పాటు మరికొన్నింటిని పెంచేందుకు టెలికాం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ప్రీపెయిడ్ యూజర్లకే కాదు.. పోస్ట్ పెయిడ్ వినియోగదారులపైనా భారం వేసేందుకు ఎయిర్టెల్ నిర్ణయానికి వచ్చింది. పోస్ట్పెయిడ్లో కూడా ఎంట్రీ లెవెల్ ప్లాన్ ధరలను ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు, రిటైల్ యూజర్లకు వేర్వేరు తరహాల్లో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ను ఫాలో అయ్యేందుకు వొడాఫోన్ ఐడియా కూడా సిద్ధమైంది. బిజినెస్ ప్లస్ పోస్ట్పెయిడ్ ప్లాన్స్ వినియోగిస్తున్న కార్పొరేట్ కస్టమర్లకు డాటా బెనిఫిట్స్ను తగ్గిస్తోంది. ఈ రెండు సంస్థలూ ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే రెవెన్యూ సగటును పెంచుకోవాలని భావిస్తున్నాయి.
ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు టారిఫ్లను పెంచాలని భావిస్తోంది. కానీ, రిలయన్స్ జియో… కస్టమర్లను చేర్చుకుంటూ పోతోంది. ఏపీఆర్యూ వృద్ధికి అనుగుణంగా యూజర్లను పెంచుకుంటోంది. రాబడిని పెంచుకునేందుకు వొడాఫోన్ ఐడియా.. తక్షణమే టారిఫ్లను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సంస్థకు 22వేల కోట్ల రూపాయల బకాయిలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉంటాయని అంచనా వేస్తోంది. వాటిని అధిగమించాలంటే టారిఫ్ల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తోంది.
మహారాష్ట్ర, గుజరాత్ సర్కిళ్లలో తన 49 రూపాయల 28 రోజుల ప్లాన్ను 14 రోజులకు కుదించింది. 28 రోజుల ప్లాన్ కోసం 79 రూపాయలు చెల్లించాలి. తొందర్లోనే అన్ని రకాల టారిఫ్లు 30 నుంచి 35 శాతం పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వర్షంలోనూ పనిచేస్తుంది...!
అంతా స్మార్ట్వాచ్ల హవా. డిజిటల్ ప్రపంచంలో అందరూ స్మార్ట్వాచ్ బాట పట్టారు. ఒక్క వాచ్ ఎన్నో దైనందిన కార్యక్రమాల్లో ఉపయోగపడుతుండటమే ఇందుకు కారణం. ప్రజల్లో వచ్చిన స్పందనతో డిజిటల్ ప్రోడక్ట్స్ అందిస్తున్న అన్ని కంపెనీలు స్మార్ట్వాచ్ల మార్కెట్లో వచ్చారు. వీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులతో స్మార్ట్వాచ్లను తీసుకువస్తున్నారు.
డిజిటల్ ప్రొడక్ట్ మేకర్ ఇన్బేస్ భారతీయ మార్కెట్లో కొత్త ‘అర్బన్ ప్లే స్మార్ట్వాచ్’ను విడుదల చేసింది. ఈ వాచ్లో అధిక పనితీరు కలిగిన రియల్టెక్ చిప్సెట్ ఉంది. వాచ్కు స్పోర్టి డిజైన్ ఇచ్చారు. అదే విధంగా జింక్ మిశ్రమం దాని తయారీలో ఉపయోగించారు. ఇది పూర్తిగా జలనిరోధితమైనది, అంటే మీరు వర్షాకాలంలో దీన్ని ఉపయోగించగలుగుతారు. ఈ స్మార్ట్వాచ్ ధరను కంపెనీ 3,999 రూపాయలుగా నిర్ణయించింది.
అల్ట్రా బ్రైట్ డిస్ప్లే
అర్బన్ ప్లే వాచ్లో 1.3-అంగుళాల ఫుల్-టచ్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 360×360 పిక్సెళ్ళు. స్క్రీన్ చుట్టూ ఎరుపు నేపథ్య డయల్ ఉంది. దీని కారణంగా వాచ్ రూపం చాలా ఆకర్షణీయంగా మారుతుంది. ఈ వాచ్ IPX68 రేటింగ్తో వస్తుంది. అంటే, మీరు వర్షం, ఈత సమయంలో కూడా దీన్ని ఉపయోగించగలరు.
అధునాతన బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ
వాచ్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని పొందుతుంది. దీనివలన ఇది ఏదైనా ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలతో కనెక్ట్ అవుతుంది. స్మార్ట్ఫోన్, టాబ్లెట్కు కనెక్ట్ అయిన తర్వాత, మీరు సంగీతం, కెమెరాను వాచ్ నుండే నియంత్రించగలుగుతారు. వాచ్లో హోమ్ బటన్ కూడా ఉంది. దీనికి 7 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. అదే సమయంలో, ప్రత్యక్ష యూఎస్బీ ఛార్జింగ్ సౌకర్యం కల్పించారు.
అన్ని నోటిఫికేషన్లు వాచ్లో కనిపిస్తాయి, సందేశాలు, స్థితి, నవీకరణలు లేదా కాల్లు వంటివి వాచ్లో నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇది కంపిస్తుంది. దీని ద్వారా నోటిఫికేషన్ తెలుస్తుంది. దీనిలో అందించిన బ్యాటరీ 30 రోజుల స్టాండ్బై సమయం అదేవిధంగా, ఒకే ఛార్జీపై 7 రోజుల పూర్తి వినియోగ బ్యాకప్ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
10 మీటర్ల లోతైన నీటిలో కూడా..
ఈ వాచ్లో చాలా హెల్త్ ట్రాకర్లను పొండవచ్చు. వీటిలో హృదయ స్పందన మానిటర్, రక్తపోటు, రక్త ఆక్సిజన్ ఉన్నాయి. వాచ్ సహాయంతో, మీరు వాతావరణ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. మీరు 10 మీటర్ల లోతైన నీటిలో కూడా వాచ్ను ఉపయోగించగలరు. అలాగే ఈ వాచ్ మంచినీరు తాగమని గుర్తు చేస్తుంది.
వాచ్లో నంబర్స్ గేమ్ కూడా..
అర్బన్ ప్లే స్మార్ట్వాచ్లో, మీరు బిల్డ్-ఇన్ నంబర్స్ గేమ్ను కూడా పొందుతారు. వాచ్ ఫ్రేమ్ మెటల్. అదే సమయంలో, దాని పట్టీ 20 మిమీ మందంగా ఉంటుంది. ఇది సిలికాన్తో తయారు చేయబడింది. దీనిని ఎరుపు, నలుపు రంగు పట్టీలతో కొనుగోలు చేయవచ్చు.
ఆకాశ ఎయిర్లైన్స
విమాన ప్రయాణాలను సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏవియేషన్ రంగంలోని అడుగుపెడుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా. తక్కువ ధరల్లోనే విమానయాన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ లైన్స్ సంస్థను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆకాశ 'పేరుతో ఏర్పాటు చేయనున్న ఆ సంస్థ పనులు వేగం అందుకుంటున్నాయి. ఝున్ఝున్వాలాతో కలిసి జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబె 'ఆకాశ'ను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే మరో దిగ్గజ వ్యాపారవేత్త వీరితో జతకలుస్తున్నారు. ఇండియా ఎయిర్లైన్స్ మాజీ ప్రెసిడెంట్ అదిత్య ఘోష్ సైతం రాకేశ్ బృందంలో చేరనున్నారని తెలుస్తోంది. మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఝున్ఝున్వాలాకు నామినీగా ఆదిత్య ఘోష్ ఉండనున్నారట. ఆకాశ ఎయిర్లైన్స్లో ఆదిత్య ఘోష్కు 10 శాతం వాటా ఉంటుందట. అయితే మేనేజ్మెంట్లో మాత్రం ఆయన భాగంగా ఉండరట. కేవలం ఝున్ఝున్వాలాకు నామినీగా మాత్రమే వ్యవహరిస్తారని సమాచారం. 'ఆకాశ'లో ఝున్ఝున్వాలాకు 40 శాతం వాటా ఉంది. వినయ్ దూబెకు 15 శాతం వాటా ఉంది. దాంతోపాటు సీఈవో పోస్టు అదనం. ఆకాశలో ఎయిర్ బీఎన్బీ, పర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లాంటి ఇన్వెస్టర్లు ఉన్న విషయం తెలిసిందే. యూఎస్ చవక విమానయాన సంస్థ సన్ కంట్రీ ఎయిర్లైన్స్లో వీరు భాగం. మొత్తానికి విమాన ప్రయాణాలను చవక ధరల్లోనే అందించాలనే లక్ష్యంతో పనిచేసిన ప్రముఖులు ఇప్పుడు ఆకాశ ఎయిర్లైన్స్ టీమ్లో భాగమవుతున్నారు.
'అల్ట్రా లో కాస్ట్ కేరియర్' (యూఎల్సీసీ) అంటే చవక విమానయాన సంస్థ 'ఆకాశ్'తో ఆదిత్య ఘోష్... తిరిగి విమానయాన పరిశ్రమలోకి ఎంటర్ అవుతున్నారన్నమాట. 2018లో ఆయన ఇండిగో ప్రెసిడెంట్, లైఫ్టైమ్ డైరెక్టర్ హోదా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫాబ్ ఇండియా, ఓయో రూమ్స్లో బోర్డ్ మెంబర్గా ఉన్నారు. అయితే 'ఆకాశ'లో చేరుతున్నారనే విషయంపై ఆదిత్య ఘోష్ ఇప్పటివరకు స్పందిచలేదు. ఆయన ఇండిగో 10 ఏళ్లపాటు కొనసాగారు. 160 విమానాలను నిర్వహిస్తున్న ఇండిగోకు మార్కెట్లో ₹55 వేల కోట్లు షేర్ ఉంది
ఇదిలా ఉండగా ఆకాశ ఎయిర్లైన్స్కు సీవోవో నియామక ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందట. జెట్ ఎయిర్వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అయ్యర్ను ఆ పోస్టులో నియమిస్తున్నారట. మరోవైపు సీటీవోగా గోఎయిర్ రెవెన్యూ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ శ్రీనివాసన్ను నియమిస్తున్నారట. దాంతోపాటు జెట్ప్లయిట్ ఆపరేషన్స్ వైస్ప్రెసిడెంట్ ఫ్లాయిడ్ గ్రేసియస్ కూడా సీటీవోగా వస్తారట. విమానయాన రంగంలో సీనియర్ అయిన నీలూ ఖత్రీ కార్పొరేట్ అఫైర్స్ హెడ్గా వస్తారని సమాచారం. 35 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చవక విమానయాన సంస్థగా 'ఆకాశ'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఏవియేషన్ మినిస్ట్రీకి దరఖాస్తు పెట్టుకున్నారు. 'ఆకాశ'లో 70 విమానాలను నిర్వహించాలని నిర్ణయించారు.
Wednesday, July 28, 2021
నథింగ్ ఇయర్ 1 విడుదల
బ్రిటన్కు చెందిన ఈ ఎలక్ట్రానిక్ బ్రాండ్ నుంచి భారత్లో విడుదలైన మొట్టమొదటి ఇయర్బడ్స్. వీటిని మాజీ వన్ప్లస్ ఎగ్జిక్యూటివ్ కార్ల్ పీ ఆవిష్కరించారు. నథింగ్ నుంచి బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఇయర్ఫోన్లను విడుదల చేస్తున్నారు. తద్వారా వీటికి గ్లోబల్ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా విడుదలైన ఇయర్బడ్స్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్లెస్ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో నథింగ్ ఇయర్ (1) ఇయర్బడ్స్ను రూ. 5,999 ధర నిర్ణయించింది. గ్లోబల్ మార్కెట్లో కంటే వీటి ధర భారత్లోనే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఇవి EUR 99 (సుమారు రూ .8,700) ధర వద్ద లభిస్తాయని పేర్కొంది. భారత దేశంలో ఈ ధర వద్ద లభిస్తున్న ఒప్పో రియల్మీ బ్రాండ్లకు చెందిన ఇయర్బడ్స్కు నథింగ్ ఇయర్ (1) గట్టి పోటీనివ్వనుంది. వీటిని ఆగస్ట్ 17 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రీపెయిడ్ ధరలను సవరించిన ఎయిర్టెల్
ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను సవరించినట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధరను దాదాపు 60 శాతం పెంచింది. టెలికాం ఆపరేటర్ తన రూ.49 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ను నిలిపివేసినట్లు తెలిపింది. కంపెనీ బేసిక్ ప్రీపెయిడ్ ప్యాక్స్ ఇప్పుడు రూ.79 స్మార్ట్ రీఛార్జ్ నుంచి ప్రారంభమవుతాయని, డబుల్ డేటాతో పాటు వినియోగదారులకు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ మినిట్స్ వినియోగాన్ని అందిస్తున్నట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మెరుగైన కనెక్టివిటీ అందించడంపై కంపెనీ దృష్టి సారించినట్లు పేర్కొంది. ఎంట్రీ లెవల్ రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఇప్పుడు తమ అకౌంట్ బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందకుండా ఎక్కువ కాలం కనెక్ట్ కావొచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ కొత్త ధరలు జూలై 29, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.79 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రూ.64 టాక్ టైమ్, 200 ఎంబి డేటా, 28 రోజుల వాలిడిటీతో వస్తుంది.
టాటా ప్యాసింజర్ వాహనాల ధరల పెంపు?
పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా వ్యయాన్ని తగ్గించుకునేందుకు చార్జీల పెంపు తప్ప వేరే మార్గంలేదని, ముడిసరుకుల ధరలు జూన్ మాసంలో తగ్గుతాయని అంచనావేసినప్పటికీ వాటి ధరలు తగ్గకపోగా పెరుగుతుండంతో ఖర్చులు అధికమయ్యాయని, ఉక్కుతోపాటు, వాహనాల తయారీలో వినియోగించే ఇతర లోహ పరికారాలు వ్యయం పెరిగిందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. పెరగనున్న ప్యాసింజర్ వాహనాల ధరల వివరాలను త్వరలోనే టాటా మోటార్స్ వెల్లడించనుంది.
ఐసీఐసీఐ కొత్త సర్వీస్ ఛార్జీలు
ఆగస్టు 1 నుండి ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు మారనున్నాయి. ఐసీఐసీఐ వినియోగదారులకు 6 మెట్రో నగరాల్లో మొదటి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర) సేవలు ఉచితంగా లభిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీ, ఏటీఎం ఇంటర్ఛేంజ్, చెక్బుక్ ఛార్జీలు ఆగస్టు 1 నుండి మారతాయి.
* ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేస్తారు.
* ఐసీఐసీఐ వినియోగదారులకు 6 మెట్రో నగరాల్లో మొదటి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర) సేవలు ఉచితంగా లభిస్తాయి.
* మెట్రో నగరాలు కాకుండా అన్నిఇతర ప్రదేశాలలో, మొదటి 5 లావాదేవీలు ఉచితం.
* బ్యాంకు ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది.
* హోం బ్రాంచిలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. అది దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ పడుతుంది. కనిష్ఠంగా రూ.150కు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.
* నాన్ హోమ్ బ్రాంచ్ వద్ద రోజుకు రూ. 25,000 వరకు నగదు లావాదేవీలకు ఛార్జీలు లేవు. రూ. 25,000 పైన రూ.1000కి రూ.5 ఛార్జీ పడుతుంది. కనీసం రూ. 150కి లోబడి ఉంటుంది.
* థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు రూ. 25,000గా నిర్ణయించారు. రూ. 25,000 పరిమితి వరకు ప్రతి లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు అనుమతి లేదు.
* ఒక నెలలో మొదటి 4 లావాదేవీలకు ఛార్జీలుండవు. ఆ తర్వాత రూ.1000 లావాదేవీకి రూ. 5 ఛార్జీ, కనీసం రూ.150కి లోబడి ఉంటుంది.
* ఒక సంవత్సరంలో తీసుకున్న 25 చెక్లున్న చెక్ బుక్కి ఛార్జీలు లేవు. ఆ తర్వాత అదే సంవత్సరంలో 10 చెక్లున్న చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ. 20 వసూలు చేస్తుంది.
Tuesday, July 27, 2021
నోకియా XR20 ఫోన్
Nokia XR20 ధర 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం యూరో 499 (సుమారు రూ. 43,800) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో కూడా వస్తుంది, గ్రానైట్ మరియు అల్ట్రా బ్లూ షేడ్స్ ఉన్నాయి. నోకియా సి 30 యూరో 99 (సుమారు రూ .8,700) వద్ద ప్రారంభమవుతుంది. ఫోన్ 2GB + 32GB, 3GB + 32GB, మరియు 3GB + 64GB కాన్ఫిగరేషన్లను కలిగి ఉంది మరియు గ్రీన్ అండ్ వైట్ రంగులలో వస్తుంది. నోకియా 6310 (2021) ఫీచర్ ఫోన్ ధర యూరో 40 (సుమారు రూ. 3,500) మరియు ఇది బ్లాక్, డార్క్ గ్రీన్, లైట్ బ్లూ మరియు ఎల్లో కలర్లలో లభిస్తుంది.
చికెన్ వ్యర్థాలతో బయో డీజిల్
2014లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అందించిన రూ. 18 లక్షలతో పాటు.. పుకొడ్ వెటర్నరీ కళాశాల క్యాంపస్ లోనే పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన చికెన్ వ్యర్థాల నుంచి బయో డీజిల్ తయారుచేసే ప్లాంట్ను ఆయన ఏర్పాటు చేశారు. 2015 ఏప్రిల్లోనే కొచ్చిలోని భారత్ పెట్రోలియం రిఫైనరీ నిపుణులు తమ ప్లాంట్ను సందర్శించి, బయో డీజిల్ నాణ్యతను ధృవీకరించారని జాన్ అబ్రహం తెలిపారు. నాటి నుంచి పుకొడ్ వెటర్నరీ కళాశాలకు చెందిన ఒక వాహనాన్ని ఈ ఇంధనంతోనే నడుపుతున్నామని చెప్పారు. దాదాపు 100 కేజీల చికెన్ వ్యర్థాల నుంచి ఒక లీటరు బయో డీజిల్ ఉత్పత్తి అయిందని, దీన్ని మార్కెట్లో లీటరుకు రూ.59 చొప్పున విక్రయించొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ డీల్స్
నాసాకు డిస్కౌంట్ బెజోస్ ఆఫర్
2024లో చంద్రుని పైకి మానవ సహిత యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్ సిస్టం (హెచ్ఎల్ఎస్)ను బ్లూ ఆరిజిన్ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. అయితే, దీనికోసం నాసా ఇప్పటికే ఎలాన్ మస్క్కు చెందిన ‘స్పేస్ ఎక్స్’తో ఏప్రిల్లోనే ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 వేల కోట్లు) డిస్కౌంట్ ఇస్తామని కళ్లుచెదరే ఆఫర్ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని స్పేస్ ఎక్స్కు మాత్రమే అప్పగించడాన్ని నిరసిస్తూ బ్లూ ఆరిజిన్తో పాటు మరో సంస్థ డైనెటిక్స్ అమెరికా ప్రభుత్వంలో సంబంధిత శాఖను ఆశ్రయించాయి. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. తన ప్రతిపాదన నిధుల కొరతను తీరుస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్కు రాసిన లేఖలో బెజోస్ తెలిపారు. తాను ఇస్తానంటున్న ఆఫర్ వాయిదా పద్దతి కాదని.. శాశ్వతంగా 2 బిలియన్ డాలర్లు రద్దు చేస్తామని వివరించారు. ఈ ఒప్పందాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెజోస్ పెద్దఎత్తున పైరవీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నిధుల కేటాయింపునుకు సంబంధించిన బిల్లుపై అక్కడి సెనేట్లో చర్చ జరుగుతోంది. ఈ కాంట్రాక్ట్ను ‘బ్లూ ఆరిజిన్’కు ఇవ్వడం వల్ల డిస్కౌంట్తో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు బెజోస్ తెలిపారు. తాము తయారు చేయబోయే ‘బ్లూ మూన్ ల్యాండర్’ లిక్విడ్ హైడ్రోజన్తో నడిచేలా రూపొందించనున్నామన్నారు. ల్యూనార్ ఐస్ నుంచి సైతం దీనికి ఇంధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సౌరవ్యవస్థలో మరింత లోపలికి ప్రయాణించడానికి సైతం ఇది ఉపయోగపడుతుందన్నారు. పైగా ఈ ల్యాండర్ను తమ సొంత ఖర్చుతో భూ కక్ష్యలో పరీక్షిస్తామని స్పష్టం చేశారు. చంద్రుడిపైకి మానవసహిత యాత్రలోని నిధుల కొరత సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. తద్వారా మిషన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి స్పేస్ ఎక్స్తో కుదిరిన ఒప్పందంపై బెజోస్ ప్రతిపాదన ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక ‘క్రూ డ్రాగన్’ ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చింది. మరోవైపు బ్లూ ఆరిజిన్ రూపొందించిన ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకలో ఇటీవలే బెజోస్ అంతరిక్ష యాత్ర చేసి వచ్చారు. దీంతో అంతరిక్షయాన రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. భవిష్యత్తుల్లో ఇవి పర్యాటక యాత్రలుగా మారి ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో నాసా తాజా ప్రాజెక్టును దక్కించుకోవడం వల్ల ఈ రంగంపై పట్టుసాధించి పై చేయి సాధించవచ్చని బెజోస్ ఉవ్విళ్లూరుతున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రాచీన విజ్ఞానం
ప్రాచీన భారతం లో వ్యవసాయశాస్త్రం ఏంతోపరిణతి చెంది ఉంది క్రీ.పూ.నాలుగు వందల కాలం వాడైన పరాశర మహర్షి మన మొదటి వ్యవసాయ పరిశోధకుడు .ఆయన రాసిన ‘’ కృషి పరాశర’’ ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందింది . అందులోని విషయాలు ఈ నాటికీ అనుసర ణీయాలుగా ఉన్నాయి .భారత దేశం లో తప్ప ప్రపంచం మొత్తం మీద ఏ నాగరక దేశమూ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని వ్యవసాయ శాస్త్ర పరిశోధనకు ఉపయోగించ లేదు .మనకు ఖగోళ శాస్త్రాధ్యయనం అతి పరిణతి చెందిన కాలం లో ఇంకా ఆయా దేశాల వారు అందులో తప్పటడుగులు వేస్తూ ప్రాధమిక దశలోనే ఉన్నారు . ఆ దేశాలలో ఋతుపవన ప్రభావం పెద్ద గా లేక పోవటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు ‘’ కృషి పరాశర ‘’ లో ఈ నాటి ఆధునిక సాగు అయిన ‘’శ్రీ వరి ‘’.పద్ధతుల వంటి అనేక వ్యవసాయ యాజ మాన్య పద్ధతులు , సేంద్రియ వ్యవసాయ విధానాలూ ఉన్నాయి
విత్తనాల సేకరణ , నిల్వ పద్ధతులూ ఉన్నాయి . వరాహ మిహిరుడు రాసిన ‘’బృహత్ సంహిత ‘’లో వ్యవసాయ సాగు విధానాలు , ఋతు పవనాల రాకను లెక్కగాట్టే పద్ధతులు ఉన్నాయి . సుశ్రుతుడు వైద్య శాస్త్ర పితామహుడని పించుకోన్నప్పటికి ‘’బాస్మతి ‘’వంటి సుగంధ పరిమళాలను వెదం జల్లే వరి ధాన్యపు రకాలను ప్రస్తావించాడు .కశ్యప మహర్షి కూడా తన గ్రంధం లో వ్యవ సాయ అమ్శాలేన్నిటినో వివరించాడు . ఈ రోజు మనం చెప్పుకొనే ‘’గోల్డెన్ రైస్ ‘’బియ్యపు రకం , ద్రుష్టి లోపాలను సవరించే బియ్యం , జీర్ణ శక్తిని పెంచే బియ్యం రకాల వర్ణన కూడా ఉంది ఈయనా రాసిన ‘’కాశ్యపేయ కృషి సూక్తి ‘’ఈ నాటికీ మార్గ దర్శనం చేస్తోంది .
1900లో ‘’ఆయుర్వేద భిషాగ్రణి’’బిరుదు పొందిన ‘’సురపాలుడు ‘’’’వ్రుక్షాయుర్వేదం ‘’అనే గ్రంధాన్ని రాశాడు .ఇందులో వరి నాటటం దగ్గర్నుంచి దిగుబడి వరకు అన్నిటి వివరం ఉంది . విత్తన శుద్ధి , దుక్కి , వివిధ సాగు పద్ధతులు , సాగు నీటి క్రమం భూ గర్భ జల వినియోగం ,చీడ పీడలకు వేప విత్తనాల వాడకం పెంటపోగు (కంపోస్ట్ ఎరువు) తయారీ లను కూడా చర్చించిన గ్రంధం ఇది .దీనిలో పర్యా వరణ పరి రక్షణ కూడా ఉండటం ఇప్పటి వారికి ఆశ్చర్యం కలిగించే విషయం . ప్రాచీన వ్యవసాయ పరి శోధకులలో ‘’చక్ర పాణి మిశ్రా ‘’పేరొందిన వాడు .ఈయన మహా రాణా ప్రతాప్ఆస్తాన శాస్త్ర వేత్త . వ్యవసాయ పరిశోధనా గ్రంధం రాసిన శేస్ట పరిశోధకుడు భూగర్భ జల వాడకం పై ద్రుష్టి ఎక్కువ గా పెట్టాడు . వ్యవసాయ బావులు , చెరువుల నిర్మాణ విధానాలు వివరించాడు .భూగర్భ జలాలను ఏ విధం గా అన్వేషించి కనుగొని ఉపయోగించాలో స్పష్టం గా రాశాడు .ఈయన గ్రంధం ఇంగ్లీష్ లోకి అనువాదమైన్దికూడా .ఎన్నో మన ప్రాచీన వ్యవసాయ శాస్త్ర గ్రంధాలు శిధిలమై పోవటమో విదేశాలకు తరలింప బడతమో జరిగి వాటి విలువ మనకు తెలియ కుండా పోయింది .
వరి పంట
భారత దేశం లో 15,000 సంవత్సరాల నుండి వరి సాగు ప్రధానమైన పంట .ఆ కాలం లో 30 ,000పైగా వరి ధాన్యపు రకాలున్దేవి . వరి పంట13 కోట్ల సంవత్స రాల కిందటే ఉందని అంచనా . ఈ రోజు ప్రపంచం మొతం మీద రెండు లక్షల వరి రకాలున్నాయని అంటున్నారు .250 కోట్ల జనాభా కు వరి ఆహారం గా ఉంది ఆసియా లో 92శాతం ప్రజలకు ఆహారం వరి యే. ప్రపంచ వరి ఉత్పత్తిలో 97 శాతం ఆసియాలో నే ఉత్పత్తి అవుతోంది .ఇప్పటికీ పది హీను కోట్ల హేక్తారులలో వరి సాగు చేస్తున్నారు .
వర్షాన్ని కొలిచే విధానం
కృషి పరాశర లో ‘’శత యోజన విస్తీర్ణం త్రిమ్శాద్యోజన ముచ్చ్రితం
‘’అఢ’’కస్య ‘’భవే న్మానం మునిభిహ్ పరి కీర్తితమ్ ‘’
వంద యోజనాల విస్తీర్ణాన్ని ‘’ఆడకం ‘’అంటారు మూడు వందల యోజనాల ఎత్తులో ఉండే నీటి మొత్తం యెంత అని చెప్పే శ్లోకం ఇది .ఇక్కడ యోజనం అంటే దూరం తో సంబంధం ఉన్నదికాడు –‘’చూపుడు వేలు పొడవుతో సమాన మైనది ‘’అని అర్ధం .చాణక్యుడు కూడా అర్ధ శాస్త్రం లో వర్షాన్ని కొలిచే పధ్ధతి చెప్పాడు .ద్రోణ అంటే 6.4సెంటి మీటర్లు .వర్ష పాతాన్ని కొలిచే కొలత నాలుగు ఆఢకాలు .
సంఖ్యలకు అక్షరాలే సంకేతకాలు
ఆర్య భట్ రాసిన ‘’ఆర్య భట్టీయం ‘’మొదటి ప్రకరణం లో అంకెలను సంఖ్యలను అక్షరాల రూపం లో కుదించి యెంత భారీ సంఖ్య నైనా ఒక చిన్న పదం గ చెప్పేందుకు మార్గ దర్శనం చేశాడు .అందరికి అర్ధం కాక అది దూరమైంది .ఆర్య భట సాంకేతిక విషయం తెలుసు కొందాం .
అ=1,ఆ=100,ఉ =100,ఋ=1000,ఇ=10000,ఏ =1,00000,ఐ=1,000000,ఔ=1,0000000,ఒ=1,00000000
అలాగే హల్లులకు విలువలిచ్చాడు క=1,ఖ=2,గ=3—ద=19,న=20 —-మ=25,య=30,ర=40 ల=50,వ=60,శ=70,ష=80,స=90,హ=100
సూర్యుడి భ్రమణాల సంఖ్య ను వివరించటానికి ఆర్య భట ‘’ఖ్యుఘ్రు’’అనే మాటన వాడాడు .ఆయన దీని పై ఒక శ్లోకం చెప్పాడు ఇందులో పదాలను విడగొడితే ఖ +ఉ+య+ఘ+ఋ.వీటిని పైన చెప్పిన సంకేతాల సంఖ్యకు అను వర్తింప జేస్తే 43,20 ,000అవుతుంది ఈ సంఖ్యయే సూర్య భ్రమణాల సంఖ్యగా ఆర్య భట తెలియ జేశాడు .ఇదీ మన ప్రాచీన విజ్ఞానం
Monday, July 26, 2021
రూ.3,000 బెస్ట్ మోడల్స్
వన్ప్లస్ బులెట్ వైర్లెస్ జెడ్- బాస్ ఎడిషన్
రూ. 3 వేలలోపు లభించే అద్భుతమైన ఇయర్ఫోన్స్లో వన్ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ (బాస్ ఎడిషన్) ఇయర్ఫోన్స్ ఒకటి. వన్ప్లస్ ఆఫర్లలో భాగంగా వీటిని రూ. 1,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వీటిలో మెరుగైన బాస్, రిచ్ సౌండ్ కోసం వీటిలో 9.2 ఎంఎం డ్రైవర్లను అందించారు. ఈ వైర్లెస్ ఇయర్ఫోన్లు 100 ఎంఎస్ లో లాటెన్సీ, వార్ప్ ఛార్జ్ సపోర్ట్ను కలిగి ఉంటాయి. వీటిని కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. ఈ వన్ప్లస్ బుల్లెట్ వైర్లెస్ జెడ్ బాస్ ఎడిషన్ మొత్తం 17 గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటాయి.
Samsung Galaxy A22 5G: సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ సేల్ ప్రారంభం... రూ.1,750 వరకు డిస్కౌంట్
iPhone 12: ఐఫోన్ 12 ధర రూ.12,000 తగ్గింది... ఆఫర్ వివరాలు ఇవే
సోనీ WI-XB400
సోనీ WI-XB400 ఇయర్ఫోన్లు 12nm డ్రైవర్ యూనిట్తో వస్తాయి. వీటిని ప్రస్తుతం రూ .3,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇవి బ్లాక్, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. డీప్ మ్యూజిక్ కోసం వీటిలో ఎక్స్ట్రా బాస్ సౌండ్ సిస్టమ్ను అందించారు. ఈ వైర్లెస్ ఇయర్ఫోన్స్లో 15 గంటల బ్యాటరీ లైఫ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బ్లూటూత్ వి 5, 10 మీటర్ల కనెక్టివిటీ వంటి ఫీచర్లను చేర్చింది.
రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో
రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోలో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్, లో లాటెన్సీ మోడ్, ఐపిఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్, 13.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించింది. నెక్బ్యాండ్ తరహా ఈ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఎల్డిఎసి బ్లూటూత్ కోడెక్ సపోర్ట్తో వస్తాయి. ఇవి క్వాలిటీ సౌండ్ను అందిస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 22 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. జూలై 29 వరకు కొనసాగుతున్న రియల్మీ డేస్ సేల్లో భాగంగా వీటిపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా, దీని అసలు ధర రూ .3,999 ఉండగా.. రూ. 2,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Poco F3 GT: కాసేపట్లో పోకో ఎఫ్3 జీటీ సేల్... డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలివే
Redmi Note 10T 5G: కాసేపట్లో రెడ్మీ నోట్ 10టీ 5జీ సేల్... రూ.1,750 వరకు డిస్కౌంట్
అంకర్ సౌండ్బడ్స్ స్లిమ్
మీ అన్ని అవసరాలను తీర్చే అంకర్ సౌండ్బడ్స్ స్లిమ్ ఇయర్ఫోన్స్పై అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం, వీటిని రూ. 2,749 ధర వదద్ కొనుగోలు చేయవచ్చు. సౌకర్యవంతమైన వ్యాయామ సెషన్ల కోసం వీటిలో ఇన్-ఇయర్ హుక్స్ను అందించారు. వినియోగదారులు మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఇన్-లైన్ కంట్రోల్ను అందించడం విశేషం. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు ఏడు గంటల బ్యాటరీని అందిస్తాయి.
సెన్హైజర్ సిఎక్స్ 120 బిటి
రూ.3 వేల ధరలోపు లభించే ఇయర్ఫోన్లలో సెన్హైజర్ సిఎక్స్ 120 బిటి ఇయర్ఫోన్లు బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ప్రస్తుతం, వీటిని రూ. 1,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వీటిలో బ్లూటూత్ 4.1 కనెక్టివిటీతో పాటు ఎస్బిసి, ఆప్టిఎక్స్ బ్లూటూత్ కోడెక్ల సపోర్ట్ను అందించారు. వీటిలో మల్టిపుల్ కనెక్టివిటీతో పాటు ఆప్టిఎక్స్ లో లాటెన్సీ కోడెక్ సపోర్ట్ను చేర్చారు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఆరు గంటల వరకు బ్యాటరీ లైఫ్ను అందిస్తాయి.
బెస్ట్ డీల్స్ ఇవే!
అమెజాన్ డివైజెస్..
స్మార్ట్ ఫోన్స్..
ఆడియో..
అమెజాన్ డివైజెస్..
అమెజాన్ ఇండియా తన స్వంత పరికరాలలో ఎక్కువగా డిస్కౌంట్స్ ఇస్తోంది. స్మార్ట్ స్పీకర్లు మరియు డిస్ ప్లేల నుండి కిండ్లే పరికరాల వరకు, చాలావాటి మీద డిస్కౌంట్స్ ఇస్తుంది.
Echo Dot 3rd gen plus Wipro 9W smart LED bulb for Rs 2,299 (రూ .4,299 ఆదా)
Echo Show 5, Fire TV Stick 4K and Wipro 9W smart LED bulb for Rs 7,748 (రూ .9,249 ఆదా)
Echo Show 8 for Rs 7,999 (రూ .5 వేలు ఆదా)
Kindle 10th gen with built-in light for Rs 6,299 (రూ. 1,700 ఆదా)
Kindle Oasis 10th gen 8GB for Rs 17,999 (రూ .4,000 ఆదా)
అమెజాన్ ప్రైమ్-డే లో కొన్ని కట్-ప్రైస్ స్మార్ట్ఫోన్లు కూడా ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 12 64 జిబి రెడ్ 67,999 రూపాయలకు (రూ .11,901 ఆదా)
శాంసంగ్ గెలాక్సీ ఎం 51 రూ .19,999 కు (రూ .5 వేలు ఆదా)
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 256 జిబి రూ .54,999 ( రూ .31,001 ఆదా)
ఆడియో డివైజెస్:
హెడ్ఫోన్లు, నిజమైన వైర్లెస్ ఇయర్బడ్లు పలు రకాల డీల్స్ భారీ డిస్కౌంట్స్ లో లభిస్తున్నాయి.
ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్రో రూ .17,999 ( రూ .6,901 ఆదా)
బోస్ క్వైట్ కంఫర్ట్ 35 II రూ .18,990కే (రూ .10,373 ఆదా చేయండి)
బోస్ సౌండ్స్పోర్ట్ ఉచిత 13,699 రూపాయలకు ( రూ .5,291 ఆదా)
వన్ప్లస్ బడ్స్ జెడ్ రూ .2,699 (రూ .491 ఆదా)
శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ రూ .4,990 (రూ .7,000 ఆదా)
సెన్హైజర్ హెచ్డి 250 బిటి హెడ్ఫోన్లు 3,990 రూపాయలకు (రూ. 1,500 ఆదా)
సోనీ WF-1000XM3 రూ .12,990 కు (రూ .7,000 ఆదా)
సోనీ డబ్ల్యూహెచ్ -1000 ఎక్స్ఎం 4 రూ .23,990 (రూ .6,000 ఆదా)
డిసెంబర్లో అంతరిక్షయాత్ర చేపట్టలేం: ఇస్రో
కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం అంతరిక్ష కార్యక్రమాలపై పడింది. డిసెంబర్లో చేపట్టాల్సిన మానవ రహిత అంతరిక్ష యాత్రను ఇస్రో వాయిదా వేసింది. మహమ్మారి కారణంగా ప్రతిష్ఠాత్మకమైన యాత్రకు అవసరమైన విడిభాగాల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, అందుకే మానవ రహిత అంతరిక్ష యాత్రను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. డిసెంబర్లో మానవ రహిత యాత్ర చేపట్టడం కచ్చితంగా సాధ్యం కాదు అని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. మానవ సహిత యాత్ర 'గగన్ యాన్'లో భాగంగా మొదట రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలను చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. ఇటీవల కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించడంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో స్పేస్ హార్డ్వేర్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ కారణంగా బెంగళూరులోని అంతరిక్షశాఖ విడిభాగాల సరఫరాలో జాప్యం చోటుచేసుకున్నది. గగన్యాన్ డిజైన్, అనాలసిస్, డాక్యుమెంటేషన్ను ఇస్రో ఇప్పటికే పూర్తిచేసింది. కానీ, గగన్యాన్ రూపొందించడానికి అవసరమైన హార్డ్వేర్ దేశవ్యాప్తంగా ఉన్న వందల పరిశ్రమల నుంచి సరఫరా కావాల్సి ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన...!
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకు కి బదిలీ చేయవచ్చు. అవసరాన్ని బట్టి పోస్ట్ ఆఫీస్ కి కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని చిన్న పొదుపు పథకాల్లో కెల్లా సుకన్య సమృద్ధి యోజన పథకం ఉత్తమమైనదని చెప్పవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన అర్హతలు:
ఆడపిల్ల జన్మించిన దగ్గర నుండి పది ఏళ్ల వయసు వచ్చేలోపు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ తెరవచ్చు. ఆడపిల్లకు 10 ఏళ్ళు దాటితే అకౌంట్ తెరవడానికి సాధ్యపడదు. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వస్తే.. ఖాతా ఆమె ఆధీనంలోకి వస్తుంది. అప్పటివరకు తల్లిదండ్రులు/సంరక్షకులకు మాత్రమే అకౌంట్ పై అధికారం ఉంటుంది.
సుకన్య సమృద్ధి ఖాతా ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 15 సంవత్సరాలు. మీరు ఖాతా తెరిచిన సమయం నుంచి 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. అనగా ఖాతా తెరిచిన సమయం నుంచి 21 సంవత్సరాల వరకు ఈ పథకం పనిచేస్తుంది. అయితే ఒక కుటుంబం కేవలం 2 ఖాతాలు మాత్రమే తెరవాలి. ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు కవలలు ఉన్నట్లయితే 3 ఖాతాలు తెరవచ్చు. మొదటి డెలివరీలో కవలలు (ఇద్దరు ఆడపిల్లలు) రెండవ డెలివరీలో మరొక ఆడపిల్ల జన్మిస్తే ఆ ముగ్గురు పిల్లల కోసం 3 ఖాతాలు తెరవవచ్చు. .
సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్ నిబంధనలు
* ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా లేదా పోస్ట్ ఆఫీసులోనైనా కనీసం రూ.250 డిపాజిట్ చేసి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు.
* ప్రతీ సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఖాతాలో రూ.250 డిపాజిట్ చేయని యెడల రూ.50 పెనాల్టీ పడుతుంది. అంతేకాదు, అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్ గా మారుతుంది. అప్పుడు పెనాల్టీతో పాటు రూ.250 డిపాజిట్ చేస్తే నార్మల్ అకౌంట్ గా మారుతుంది. ఒకవేళ మీరు ఖాతా తెరిచిన తర్వాత 3 సంవత్సరాలు వరకూ ఒక్క పైసా కూడా డిపాజిట్ చేయలేదు అనుకోండి. అప్పుడు మీరు రూ.150 పెనాల్టీతో పాటు ఒక్కో ఏడాదికి 250 చొప్పున 3 సంవత్సరాలకు రూ.750 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
* సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో సంవత్సరానికి గరిష్టంగా 1.50 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరిమితి దాటి ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు మీకు వెంటనే వెనక్కు వచ్చేస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు & పన్ను ప్రయోజనాలు:
సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికం ప్రకారం సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు 7.6 శాతం వడ్డీ రేటు పొందేందుకు అర్హులు. సంపాదించిన వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతాకు జమ అవుతుంది. ఈ పథకం ఖాతాలపై ప్రతీ త్రైమాసికానికి వడ్డీరేట్లు మారుతుంటాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను నుంచి మినహాయింపు పొందటానికి ఖాతాదారులు అర్హులు.
ఖాతా క్లోజింగ్ & విత్ డ్రాయల్:
సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయొచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు వచ్చినా లేదా పదో తరగతి పూర్తిచేసినా.. ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.
స్మార్ట్ వాచెస్ తక్కువ ధరలో పొందాలనుకుంటున్నారా?
తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉండి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే స్మార్ట్ వాచ్ దొరకడం చాలా అరుదు. మార్కెట్లో ఇటీవల అనేక కొత్త మోడల్స్ వచ్చినా.. 3,599 రూపాయలకి దీన్ని మించిన స్మార్ట్ వాచ్ లేదు. దీని అసలు ధర రూ. 3,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్తో రూ. 3,599కే లభిస్తోంది.
అసలు ధర 5,799 కాగా ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం 3,999 మాత్రమే... https://amzn.to/30piFLc
ప్రత్యేకతలు:
1.43 అంగుళాల పరిమాణం కలిగిన టచ్ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ చేత రక్షణ కల్పించబడి ఉంటుంది.
బ్లడ్లో ఆక్సిజెన్ శాతాన్ని తెలియజేసే SPO2 సదుపాయం ఉంటుంది.
హార్ట్ రేట్ మోనిటరింగ్ ఫీచర్ లభిస్తుంది
5 అడుగుల లోతు వరకూ నీటిలో పడినా చెక్కు చెదరని విధంగా వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది.
బ్రీతింగ్ ట్రెయినింగ్తో పాటు స్ట్రెస్ మోనిటరింగ్ ఫీచర్ కలిగి ఉంటుంది
మనకు నచ్చిన విధంగా వాచ్ స్వరూపాన్ని మార్చుకునే భారీ మొత్తంలో వాచ్ ఫేస్లు లభిస్తాయి.
60 విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి.
ఫోన్ నుండి ఇన్కమింగ్ కాల్స్, టెక్ట్స్ మెసేజ్లు, వాట్సప్ నోటిఫికేషన్లు వాచ్లో చూడొచ్చు.
ఒకసారి ఛార్జింగ్ చేస్తే 9 రోజుల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది
కొనుగోలు చేసే లింక్: https://amzn.to/30piFLc
నార్వేలో ఉల్కాపాతం
Sunday, July 25, 2021
శామ్సంగ్ టీవీ ధర కోటికి పైనే!
శామ్సంగ్ నుంచి మైక్రో ఎల్ఈడీ టీవీని “ది వాల్” పేరుతో రెండవ వెర్షన్ టీవీని విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన జెన్ తో పోల్చితే ఇది అప్డేటెడ్ వర్షన్.. 110 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. దీని ధర కూడా భారీగానే ఉండనుంది. గతేడాది విడుదల చేసిన జెన్ వెర్షన్ ఎల్ఈడీ టీవీని 156000 డాలర్లుగా నిర్దారించింది కంపెనీ.. ఇది భారత కరెన్సీలు రూ.1,16,10,612 గా ఉంది. ఇక ది వాల్ ధర కూడా కోటికి పైనే ఉండనుంది.
తలనొప్పిని తగ్గించే హెడ్ సెట్
గరుడ సైకిల్

వాహనాల మార్కెట్లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఈవీ టెక్నాలజీ వైపు అంతా ఆసక్తి చూపుతున్న నేపధ్యంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు వాహనాలను తయారీకి అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు కాస్త ఎక్కవగా ఉండటంతో, తేలికపాటి, తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిళ్ళను కొనుగోలు చేసేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నహాక్ మోటార్ ఇలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్లో ఈవీ సైకిల్ ను రూపొందించింది. గరుడ, జిప్సీ పేరుతో రెండు మోడళ్ళల్లో సైకిల్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది.ఈ సైకిల్ ను మామూలు సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. తొక్కలేని పరిస్ధితుల్లో బ్యాటరీ సాయంతో ఈవీగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 40 కిలో మీటర్లు ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు అవుతుంది. గరుడ మోడల్ ధర 31,999రూపాయలుకాగా, జిప్సీ ధర 33,499 రూపాయలుగా నిర్ణయించారు
యువ సైంటిస్ట్
బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు. మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్లూ తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు. మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు. ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది. ఈ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట.డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు. అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్లు ఉన్నాయి.ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది. దానితో కూలి పనులకు వెళ్ళి ఓ 2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం కట్టాడు. ఆ కాంపిటిషన్లో 2nd ప్రైజ్ వచ్చింది. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్లో పాల్గొనే అవకాశం లభించింది.ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు. జపాన్కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి. చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు.విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు. ఇతర ఖర్చుల కోసం తన తల్లి తన మంగళ సూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా వచ్చిన 60,000/- ఇచ్చింది.
బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు. బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు. అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరకు గమ్యం చేరాడు. అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు. అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి. కాంపిటిషన్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు. అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, పక్షికన్ను మాత్రమే కనపడింది.. అలాగే మన ప్రతాప్కు కూడా తన మనస్సు తన డ్రోన్ మోడల్పైనే ఉంది. తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు. వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు. మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్లో పాల్గొన్నారు. రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు. ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు. నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు. ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది ఫ్రాన్స్కు వెళ్ళింది. తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది అమెరికాకు వెళ్ళింది. అప్పిటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు. ఇంతలో చివరి అనౌన్స్మెంట్ వినిపించింది: "Please Welcome #Mr_Pratap, First Prize, From INDIA." అంతే లగేజీ అక్కడే వదిలేశాడు, కిందపడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, ధన సహాయం చేసిన దాతల పేర్లను స్మరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు.రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది. ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు.
మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి. (సుమారు 7 లక్షల రూపాయలు) 3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు. "నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్" అన్నారు "నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా జన్మ భూమికి సేవచేయడమే నా సంకల్పం" అని వారికి కృతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు. మోదీజీ అతనిని అభినందించి DRDOకు రెఫర్ చేశారు. ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు.
Saturday, July 24, 2021
ఎయిర్టెల్, వోడాఫోన్ బంపర్ ఆఫర్ !
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం గురించి మాట్లాడుకుంటే, ప్రైమ్ సభ్యత్వం అనేది కంపెనీ అందించే సభ్యత్వం. దీని ప్రయోజనాల ప్రకారం వస్తువులపై అపరిమిత ఉచిత ఒక రోజు మరియు రెండు రోజుల డెలివరీ ఉన్నాయి; ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ మరియు ఉచిత ఇన్-గేమ్ కంటెంట్ కు ఉచిత యాక్సిస్; మరియు సాధారణ అమ్మకాల సమయంలో ప్రారంభ యాక్సిస్ ఇవ్వబడుతుంది. నెలకు రూ .129 లేదా సంవత్సరానికి రూ .999 చెల్లించి ప్రైమ్ సభ్యత్వానికి సైన్ అప్ చేయవచ్చు. ఇవి కాకుండా, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ అందించే కొన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి, ఇవి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని చందాదారులకు ఉచితంగా అందిస్తున్నాయి. ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందించే ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ నుండి ప్రణాళికలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకుందాం.కింద పేర్కొన్న అన్ని ప్లాన్లలోను అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా ఇవ్వబడుతుంది
వోడాఫోన్ - ఐడియా ప్లాన్లు
* వోడాఫోన్-ఐడియా రూ .499 పోస్ట్పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో 75GB మొత్తం
డేటా, అన్ని నెట్వర్క్లలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS
లు పొందవచ్చు
* వోడాఫోన్-ఐడియా రూ .699 పోస్ట్పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో అపరిమిత డేటా,
అన్ని నెట్వర్క్లలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు
పొందవచ్చు.
* వోడాఫోన్-ఐడియా రూ .1099 పోస్ట్పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో అపరిమిత
డేటా, అన్ని నెట్వర్క్లలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS
లు పొందవచ్చు.
ఎయిర్టెల్ ప్లాన్లు
* ఎయిర్టెల్ రూ .499 పోస్ట్పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో 75GB మొత్తం డేటా,
అన్ని నెట్వర్క్లలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు
పొందవచ్చు
* ఎయిర్టెల్ రూ .999 పోస్ట్పెయిడ్ ప్లాన్ (1 + 2 యాడ్-ఆన్ ప్లాన్) : ఈ
ప్లాన్ లో 210GB డేటా (ప్రాధమిక సంఖ్యకు 150GB + సంఖ్యలను జోడించడానికి
30GB), అన్ని నెట్వర్క్లలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS
లు పొందవచ్చు
* ఎయిర్టెల్ రూ .1599 పోస్ట్పెయిడ్ ప్లాన్ (1 + 3 యాడ్-ఆన్ ప్లాన్): ఈ
ప్లాన్ లో 500 జీబీ మొత్తం నెలవారీ డేటా, అన్ని నెట్వర్క్లలో అపరిమిత
వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు పొందవచ్చు
* ఎయిర్టెల్ రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ లో 2.5GB రోజువారీ
డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మరియు రోజుకు 100 SMS లు 28 రోజుల
కాలపరిమితి పొందుతారు.
* ఎయిర్టెల్ రూ .131 ప్రీపెయిడ్ ప్లాన్ (యాడ్-ఆన్) : ఈ ప్లాన్ లో 100MB
మొత్తం డేటా, అపరిమిత కాలింగ్, మరియు రోజుకు 100 SMS అలాగే క్వాలిటీ
ప్రస్తుత ప్యాక్ వాలిడిటీ వరకు ఉంటుంది.
గమనిక: ఈ ప్రణాళికలో, వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం 30 రోజులు
మాత్రమే లభిస్తుంది
ఎల్జీ : మాస్కులోనే మైక్, స్పీకర్లు
చిన్నగా, తేలిగ్గా ఉండే ఈ మాస్కు శక్తివంతమైన మోటార్తో ఇది పని చేస్తుంది. మాస్కు వినియోగించే వ్యక్తి శ్వాసను బట్టి ఎల్డీ డ్యుయల్ ఫ్యాన్లు ఎయిర్ ఫ్లోను ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తాయి. దీనిద్వారా మాస్కు ధరించినా నేచురల్ గాలిని ఎంతో సౌకర్యవంతంగా తీసుకోవచ్చు. ప్యూరికేర్ మాస్కులు ఎయిర్ లీకేజీని చాలా వరకు తగ్గిస్తాయి. నోరు, చెంపలను పూర్తిగా కవర్ చేస్తూ టైట్గా ఉన్నా ఎక్కువ గంటలు వాడినా ఇబ్బంది అనిపించదు' అని ఎల్జీ ప్రకటించింది. ఎల్జీ తీసుకొచ్చిన ఈ ప్యూరీకేర్ మాస్కు 94 గ్రాముల బరువు ఉంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఈ మాస్కు 8 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అయితే మాస్కులో ఎలాంటి ఫిల్టర్లను ఉపయోగించింది ఎల్జీ స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే ఎప్పుడు లాంచ్ చేస్తామనేది కచ్చితంగా చెప్పకపోయినా.. ఆగస్టులో థాయ్లాండ్లో విడుదల చేయడం ఖాయంగా ఉంది.
ఆ తర్వాత ఆయా దేశాల ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్కులను ప్రవేశపెట్టనుంది. అలాగే టోక్యో ఒలింపిక్స్ పాల్గొంటున్న 120 మంది థాయ్లాండ్ అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బంది ఈ ప్యూరికేర్ మాస్కులను ధరించనున్నారని ఎల్జీ ప్రకటించింది. గతేడాది జూలైలోనే ఎయిర్ ప్యూరిఫయర్తో మాస్కును లాంచ్ చేసింది ఎల్జీ. మూడు స్పీడ్ మోడ్లతో రెండు ఫ్యాన్లతో దాన్ని తీసుకొచ్చింది. గాలి పీల్చుకునే సమయంలో ఆ ఫ్యాన్లు స్పీడ్గా.. గాలి వదిలే సమయంలో స్లోగా తిరిగి శ్వాసకు అనుకూలంగా ఉండేలా తయారు చేసింది. ఇప్పుడు ఏకంగా బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్లతో కొత్త తరహా మాస్కును ప్రవేశపెట్టింది
రిలయన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్'
డిజిటల్ ఇండియా సేల్ 24 జూలై, 2021 న ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ మరియు www.reliancedigital.in లో కూడా లైవ్ గా లభిస్తుంది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. జూలై 22 నుండి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస ట్రాన్సాక్షన్ పై SBI క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ SBI క్రెడిట్ కార్డ్స్ EMI ట్రాన్సాక్షన్స్ పై కూడా లభిస్తుంది. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ మరియు యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు మరియు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ మీద యాక్సిడెంటల్ డ్యామేజ్ మరియు లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభిస్తుంది. అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న Oneplus Nord2 స్మార్ట్ ఫోన్ జూలై 28 న లాంఛ్ తర్వాత ఈ సేల్ లో లభిస్తుంది. ఇదే కాక, మార్కెట్ లోని కొన్ని అత్యధిక ప్రసిద్ధి చెందిన వాచీలు యాపిల్ వాచ్ సీరీస్ 6 Cellular 44mm మరియు Samsung Galaxy Active 2 వంటివి మంచి ధరలలో లభిస్తాయి. SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త Fire-Boltt AGNI స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది.
కస్టమర్లు ల్యాప్ ట్యాప్ కేటగిరీ లో, బ్యాంక్ క్యాష్ బ్యాక్ మరియు బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990/- విలువైన ప్రయోజనాలు అందుకోగలరు. 16 GB RAM మరియు & 4GB Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్స్ తో Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999/- ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. ఇంకా, Macbook Pro స్టూడెంట్స్ మరియు టీచర్లకు ప్రత్యేకంగా HDFC క్యాష్ బ్యాక్ రూ. 7000/- తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. కస్టమర్లు రూ. 16,999/తో ప్రారంభం అయ్యే థిన్ మరియు లైట్ ల్యాప్ టాప్ లు కూడా కొనుగోలు చేయమచ్చు. థిన్ మరియు లైట్ ల్యాప్ టాప్ ల మీద స్పెషల్ ఆఫర్లు జూలై 26 మరియు 27 న మాత్రమే లభిస్తాయి.
ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీలు రూ. 12,990 ప్రారంభ ధరతో లభిస్తాయి. డైరెక్ట్ కూల్ రెఫ్రిజరేటర్లు రూ. 11,990 ప్రారంభ ధరతో లభిస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. ఇంకా, రూ. 3,498/- విలువైన ఒక బ్రేక్ ఫాస్ట్ కోంబో (శాండ్విచ్ మేకర్ మరియు ఒక ఎలక్ట్రిక్ కెటిల్) స్పెషల్ ధర రూ. 1,199కు లభిస్తుంది.
డిజిటల్ ఇండియా సేల్ సులభ ఫైనాన్స్ మరియు EMI ఆప్షన్లతో ఈ సంవత్సరం మరింత రివార్డింగ్ గా రూపొందించబడింది. కస్టమర్లు Insta Delivery* (3 గంటలు కంటే తక్కువ సమయం లో డెలివరీ) మరియు తమకు దగ్గర లోని స్టోర్ నుండి Store Pick-up ఆప్షన్లు పొందవచ్చు. అన్ని స్టోర్లు మరియు డెలివరీ పార్టనర్లు, కస్టమర్లు మరియు ఉద్యోగుల రక్షణ కొరకు కోవిడ్- సేఫ్టీ పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తున్నారు.
రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్. ఇది 800 సిటీలలో 460+ లార్జ్ ఫార్మట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మరియు 1800+ మై జియో స్టోర్లతో, దేశం నలుమూలలో ఉన్న కస్టమర్లకు సేవలు అందజేస్తూ, అత్యాధునిక టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉండేలా చేస్తోంది. 200 కు పైగా అంతర్జాతీయ మరియు దేశీయ ఉత్పాదనలు మరియు ఆకర్షణీయమైన ధరలలో 5000 కు పైగా ఉత్పాదనలు కలిగి ఉన్న రిలయన్స్ డిజిటల్, కస్టమర్లకు తమ అభిరుచికి తగినట్లు సరియైన టెక్నాలజీ సొల్యుషన్స్ పొందుటకు అతి పెద్ద సంఖ్యలో మోడల్స్ ఎంచుకునే సౌకర్యం అందజేస్తోంది.
రిలయన్స్ డిజిటల్ లో, ప్రతీ స్టోరులో ట్రెయినింగ్ పొంది, చక్కని సమాచారం కలిగిన స్టాఫ్, స్టోర్ లోని ప్రతి ఉత్పాదన గురించి కస్టమర్లకు సంతోషంగా పూర్తి సమాచారం అందజేస్తారు. అతి ముఖ్యంగా, రిలయన్స్ డిజిటల్ అన్ని ఉత్పాదనలకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందిస్తోంది. రిలయన్స్ ResQ, రీటైలర్ సర్వీస్ విభాగం మరియు ఇండియాలో ఏకైక ISO 9001 సర్టిఫికేట్ పొందిన ఒక ఎలక్ట్రానిక్ సర్వీస్ బ్రాండ్, వారమంతా సపోర్ట్ అందించుటకు మరియు పరిపూర్ణమైన పరిష్కారాలు అందజేయటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.
సులభంగా కొనుగోలుకు, ఇప్పుడు వినియోగదారులు ఏ రిలయన్స్ డిజిటల్ స్టోరుకైనా విచ్చేయవచ్చు లేదా www.reliancedigital.in పై లాగాన్ చేయవచ్చు, ఇది వారికి ఇన్స్టాంట్ డెలివరీ (3 గంటలకు కంటె తక్కువ సమయంలో డెలివరీ) అందజేస్తుంది మరియు వారు తమకు దగ్గరలోని స్టోరులో కూడా వాటిని పికప్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్,ఐ ఫోన్లకి సోకిందా ..
పెగాసస్ అంటే రెక్కల గుర్రం అని అర్ధం .వేగాన్ని గణిత శాస్త్రంలో హార్స్ పవర్ గా వ్యవహరిస్తాం . అంటే అశ్వ శక్తి అన్నమాట! పెగాసస్ స్పైవేర్ అంత వేగవంతంగా దాడి చేయగల సామర్ధ్యం ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు .దీని పనితీరు ని కొన్ని నివేదికల ఆధారంగా మనం గ్రహించవచ్చు. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో రాహుల్ ఫోన్ నంబర్లు కనీసం రెండు ఉన్నాయని ‘ది వైర్ ‘ వార్తా సంస్థ తెలిపింది.కొందరు కేంద్ర మంత్రులు ,ఇంకా ౩౦౦ మందికి పైగా ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారట!పెగాసస్ ఫోన్లలో ఎలా ఇన్ స్టాల్ అవుతుంది, వెళ్లి ఆ వైరస్ ఏమి చేస్తుంది,పెగాసస్ ఎలా గుర్తించాలి ..వైరస్ ఎలా వదిలించుకోవాలి ఈ విషయాలు తెలుసుకుందాం .
ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ చే అభివృద్ధి చేయబడిన ఈ పెగాసస్, ఇది అత్యంత అధునాతనమైన స్పైవేర్, దీనిని “ఇప్పటివరకు అత్యంత అధునాతన స్మార్ట్ఫోన్ దాడి” గా సూచిస్తారు.ఇది మొట్టమొదటిసారిగా2016 లో గుర్తించబడింది, కానీ 2019 చివరలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు మరియు మానవ హక్కుల కార్యకర్తలపై స్పైవేర్ ఉపయోగించబడిందని వెల్లడించినప్పుడు చాలా సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది, ఎందుకంటే ‘సండే ఈవెనింగ్’ ‘వాషింగ్టన్ పోస్ట్’ మరియు ‘గార్డియన్’ తో సహా పలు వార్తా వెబ్సైట్లు జర్నలిస్టులు, కార్యకర్తలు మరియు ఇతర ముఖ్య మీడియా ప్రముఖులపై నిఘా పెట్టడానికి 10 కి పైగా ప్రభుత్వాలు ఈ స్పైవేర్ను ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో, నివేదికల ప్రకారం, 40 మందికి పైగా జర్నలిస్టులు పెగాసస్ ఉపయోగించి నిఘాలో ఉన్నారు.
పెగాసస్ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ అవుతుందంటే..
పెగాసస్ మొదట్లో సందేశం లేదా ఇమెయిల్ ద్వారా హానికరమైన వెబ్ లింక్ ద్వారా ఫోన్కు ప్రాప్యత పొందడానికి ఉపయోగించబడింది. ఒక వినియోగదారు లింక్పై క్లిక్ చేసిన తర్వాత, ఫోన్లో పెగాసస్ ఇన్స్టాల్ చేయబడుతుంది. ఈ స్పైవేర్ చాలా శక్తివంతమైనది .ఇది కేవలం మిస్డ్ వాట్సాప్ కాల్తో ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాక, పెగాసస్ ఫోన్ లో ఇన్ స్టాల్ అయిన తరువాత ,అది ఏదైనా కాల్ లాగ్లను తొలగించగలదు, తద్వారా బాధితుడు వారి ఫోన్ స్పైవేర్ లక్ష్యంగా ఉందని కూడా తెలుసుకోవడం చాలా అసాధ్యం.
పెగాసస్ ఏమి చేయగలదంటే..
సైబర్ భద్రతా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, దాని ఇన్స్టాలేషన్ తరువాత, పెగాసస్ కాంటాక్ట్స్ కంట్రోల్లను నియంత్రిస్తాయి, ఇది ఆదేశాలను రిలే చేయడానికి మరియు సోకిన పరికరం నుండి సమాచారాన్ని సేకరించడానికి వీలు కల్పిస్తుంది. పాస్వర్డ్లు, పరిచయాలు, వచన సందేశాలను దొంగిలించడం మరియు ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ మరియు జిపిఎస్ను యాక్సెస్ చేయడం మరియు వాట్సాప్ ద్వారా చేసిన వాయిస్ లేదా వీడియో కాల్లతో ఇతర సమాచారం దాని సామర్థ్యాలలో బాగానే ఉన్నాయి
టొరంటో విశ్వవిద్యాలయం యొక్క సిటిజెన్ ల్యాబ్ ప్రకారం, “ఈ మాల్వేర్ ఫోరెన్సిక్ విశ్లేషణ నుండి తప్పించుకోవడానికి, యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించకుండా ఉండటానికి రూపొందించబడింది మరియు రిమోట్గా ఆపరేటర్లచే పనిచేయకుండా చేయబడి తొలగించబడుతుంది.”
కాస్పెర్స్కీ పరిశోధకులు దీనిని మొత్తం నిఘా కోసం ఒక సాధనం అని పిలిచారు. వారు 2017 లో ఇలా వ్రాశారు: “పెగాసస్ మాడ్యులర్ మాల్వేర్. లక్ష్యం యొక్క పరికరాన్ని స్కాన్ చేసిన తరువాత, ఇది యూజర్ యొక్క సందేశాలను మరియు మెయిల్ను చదవడానికి, కాల్లను వినడానికి, స్క్రీన్షాట్లను సంగ్రహించడానికి, లాగ్ నొక్కిన కీలను, బ్రౌజర్ చరిత్రను, పరిచయాలను తొలగించడానికి అవసరమైన మాడ్యూళ్ళను ఇన్స్టాల్ చేస్తుంది. మరియు మొదలగునవి. ప్రాథమికంగా, ఇది లక్ష్యం యొక్క జీవితంలోని ప్రతి అంశంపై గూఢచర్యం చేయవచ్చు”
పెగాసస్ వదిలించుకోవటం ఎలా …
పెగాసస్ను పూర్తిగా వదిలించుకోవడానికి ఏకైక మార్గం ప్రభావితమైన ఫోన్ను మరచిపోవడమేనని అనేక సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు మరియు నిపుణులు అభిప్రాయపడ్డారు. సిటిజెన్ ల్యాబ్ ప్రకారం, మీ స్మార్ట్ఫోన్ను ఫ్యాక్టరీ రీసెట్ చేయదానికి కూడా ఉపయోగపడదు.ఎందుకంటే ఇది స్పైవేర్ను పూర్తిగా వదిలించుకోదు. మీ పరికరం సోకిన తర్వాత కూడా దాడి చేసేవారు మీ ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడాన్ని కొనసాగించవచ్చు. అందువల్ల, పెగసాస్ను పూర్తిగా వదిలించుకోవడానికి ఏకైక మార్గం ఫోన్ను వాడకుండా వదిలేయటం మరియు మీ క్రొత్త ఫోన్లో మీరు మళ్లీ ఇన్స్టాల్ చేసే అన్ని అనువర్తనాలు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోవడం.మీ ఆన్లైన్ ఖాతాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి, మీ ఫోన్ లో ఉపయోగిస్తున్న అన్ని క్లౌడ్-ఆధారిత అనువర్తనాలు మరియు సేవల పాస్వర్డ్లను కూడా మార్చాలి.
పెగాసస్ గురించి ఆందోళన చెందాలా..
ఇది నిజంగా కాదు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. డిజిటల్ గోప్యత గురించి మీరు ఆందోళన చెందాలి – మరియు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, పెగాసస్ ఇప్పుడు పాత స్పైవేర్. ఇది బాగా పరిశోధించబడింది మరియు వాట్సాప్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు ఇతర సంస్థలు తమ సాఫ్ట్వేర్లో భద్రతా లొసుగులను అతుక్కొని, అంతకుముందు పెగాసస్ తన పనిని చేయడానికి అనుమతించాయి. దురదృష్టవశాత్తు, అయితే, పెగాసస్ యొక్క కొత్త వైవిధ్యాలు అక్కడ లేవని దీని అర్థం కాదు. పెగాసస్ యొక్క కొత్త వైవిధ్యాలు లేదా కొన్ని సారూప్య స్పైవేర్ ఇప్పటికీ శక్తివంతమైనవి.కానీ మీరు ఇంక ఆందోళన చెందనవసరం లేదు,ఎందుకంటే పెగాసస్ వంటివి లక్ష్యంగా ఉన్న నిఘా సాధనం. ఇది కొనడానికి ఖరీదైనది – మిలియన్ డాలర్లతో వ్యవహారం!
అందువల్ల పెద్ద సంస్థలు మరియు ప్రభుత్వాలు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏ సమయంలోనైనా, ఈ సాధనాలు వందల లేదా వేల మందికి వ్యతిరేకంగా మాత్రమే ఉపయోగించబడతాయి. లేదా అంతకంటే తక్కువ. మరో మాటలో చెప్పాలంటే, సాఫ్ట్వేర్ వంటి పెగాసస్ ప్రధానంగా పాత్రికేయులు, న్యాయవాదులు,అగ్ర వ్యాపార నాయకులు,రాజకీయ నాయకులు మరియు రహస్య సమాచారాన్ని పొందే అవకాశం ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది.మీరు వారిలో ఒకరు కాకపోతే,మీరు లేదా మీ ఫోన్ పెగాసస్ వంటి వాటిని ఎదుర్కొనే అవకాశాలు లేవు.కాబట్టి సామాన్యులు భయపడాల్సిన పని లేదు.ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.
Friday, July 23, 2021
ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్
Poco X3 Pro: పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.18,999 కాగా ఆఫర్ ధర రూ.17,249.
Realme X7 5G: రియల్మీ ఎక్స్7 5జీ స్మార్ట్ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.18,999.
Realme Narzo 30 Pro 5G: రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ.15,499.
4. Realme 8: రియల్మీ 8 స్మార్ట్ఫోన్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా ఆఫర్ ధర రూ.13,999.
5. Motorola G40 Fusion: మోటోరోలా జీ40 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,499 కాగా ఆఫర్ ధర రూ.13,499.
6. Motorola G60: మోటోరోలా జీ60 స్మార్ట్ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.16,999.
Realme X7 Max: రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ స్మార్ట్ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.26,999 కాగా ఆఫర్ ధర రూ.23,499.
OPPO A12: ఒప్పో ఏ12 స్మార్ట్ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.9,990 కాగా ఆఫర్ ధర రూ.8,490.
OPPO A33: ఒప్పో ఏ12 స్మార్ట్ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.9,990 కాగా ఆఫర్ ధర రూ.9,490.
Samsung Galaxy F62: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.23,999 కాగా ఆఫర్ ధర రూ.17,999.
Realme X7 Pro 5G: రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.28,499 కాగా ఆఫర్ ధర రూ.26,999.
Oppo F17 Pro: ఒప్పో ఎప్17 ప్రో స్మార్ట్ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.19,990 కాగా ఆఫర్ ధర రూ.17,990.
మిసైల్ ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఇవాళ్టి టెస్ట్ లో.. లాంచర్, రాడర్, కమాండ్ అండ్ కంట్రోల్తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించినట్లు డీఆర్డీఓ తెలిపింది.
జొమాటో షేర్లు దుమ్ము రేపుతున్నాయి
తొలిరోజే జొమాటో షేర్లు స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదై దుమ్ము రేపుతున్నాయి. ఈ కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా.. దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. దీంతో 2020 తర్వాత ఐపీఓకి వచ్చిన సంస్థల్లో 50 శాతం ప్రీమియం లిస్టింగ్ సాధించిన 10 కంపెనీల జాబితాలో చేరింది. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో సెన్సెక్స్లో జొమాటో షేరు ధర 62 శాతం ఎగబాకి రూ.123.35 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సంస్థ షేర్లు ఓ దశలో రూ.138కు చేరి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లను దాటింది. దీంతో బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన చేరింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్ను దాటేయడం విశేషం.
ఫుడ్ డెలివరీ రంగానికి చెందిన ఓ కంపెనీ ఐపీఓకి రావడం ఇదే తొలిసారి. అలాగే గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ నడుస్తుండడం జొమాటో శుభారంభానికి దోహదం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి కంపెనీ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అవేవీ షేరు దూకుడును అడ్డుకోలేకపోయాయి. పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వం కంపెనీపై సానుకూల ధోరణిని తీసుకొచ్చి పెట్టింది. గతంలో నష్టాల్లో ఉన్నప్పటికీ.. నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ప్రస్తుతం మంచి వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని మదుపర్లు పరిగణనలోకి తీసుకున్నట్లున్నారు. పైగా భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆధారిత, ఫుడ్ డెలివరీ రంగానికి మంచి వృద్ధి ఉండనుందన్న అంచనాలు జొమాటో షేర్ల దూకుడుకు కారణమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు లాభనష్టాలతో సంబంధం లేకుండా మార్కెట్లో జొమాటో తన ఉనికిని విస్తరిస్తూ పోయింది. 2018 ఆర్థిక సంవత్సరంలో 3.06 కోట్లుగా ఉన్న ఆర్డర్లు.. 2021 నాటికి 23.89 కోట్లకు పెరగడం విశేషం. మార్చి 2021 నాటికి భారత్లో 525 నగరాల్లో జొమాటో సేవలందిస్తోంది. మొత్తం 3,89,932 రెస్టారెంట్లు జొమాటోలో లిస్టయ్యాయి.
భారత్లో గత కొన్నేళ్లలో వచ్చిన జీవనశైలి మార్పులు ఫుడ్టెక్ కంపెనీలకు భారీ డిమాండ్ను తీసుకొచ్చి పెట్టాయి. అదే సమయంలో టెక్, ఇంటర్నెట్ ఆధారిత సేవలకు ఆదరణ పెరిగింది. వీటితో పాటు ప్రజల ఆహార అలవాట్లలో సైతం మార్పు వచ్చింది. ప్రజల వ్యయ ప్రాథమ్యాలు సైతం మారాయి. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం డిజిటలైజేషన్ను భారీగా ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలన్నీ జొమాటో షేరుపై ఆసక్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ హోం డెలివరీ
Thursday, July 22, 2021
మార్కెట్లోకి ఆడీ ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్లు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లో తొలిసారి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఈ-ట్రాన్ పేరిట మూడు ఎస్యూవీలను గురువారం విడుదల చేసింది. ఇందులో ఈ-ట్రాన్ 50 ధరను ₹99.99 లక్షలుగా నిర్ణయించగా.. ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55 ధరను ₹1.16 కోట్లు, ₹ 1.18 కోట్లుగా (ఎక్స్షోరూమ్ ధరలు) నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్లో తాము ఒకటి కాదు.. మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఒకేసారి తీసుకొచ్చామని విడుదల సందర్భంగా ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. వీటి విడుదలతో భారత్లో తమ విద్యుత్ వాహనాల ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. ఆఫ్టర్ సేల్స్, ఛార్జింగ్, ఓనర్షిప్తో పాటు పలు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. మూడేళ్ల బైబ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నామని చెప్పారు. త్వరలో మరిన్ని విద్యుత్ వాహనాలు తీసుకొస్తామని వెల్లడించారు.
ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55 కార్లలో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటర్లు వినియోగించారు. ఇవి 300kW పవర్ను, 664 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని కంపెనీ తెలిపింది. 95kWh లిథియం ఐయాన్ బ్యాటరీ కలిగిన ఈ ఎస్యూవీలు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 359-484 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ-ట్రాన్ 50లో డ్యూయల్ మోటార్ ఉంది. 71kWh లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్తో 264-379 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వీటిలో రెండువైపులా ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. స్టాండర్డ్ వారెంటీ 2 ఏళ్లతో పాటు హై వోల్జేజ్ బ్యాటరీ వారెంటీ 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు (ఏది ముందైతే అది) అందిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, ఐదేళ్ల పాటు రోడ్సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నట్లు ఆడీ తెలిపింది.
భారీ డిస్కౌంట్
మంచి క్వాలిటీ బ్యాక్ ప్యాక్ కోసం చూస్తున్నారా? MOCA Oxford Fabric Mens Backpack Backpacks for men Mens womens BackPack with USB Charging Port Durable Daypack BackPack backpacks for College Work Travel office Outdoor sports gym Unisex Mens backpacks BackPack (2248 Black) అసలు ధర 2199 కాగా ఇప్పుడు కేవలం 1299కే లభిస్తోంది.. https://amzn.to/3fTUwDC
జియో ఫైబర్:రూ.199 కే 1000జీబీ డేటా
దేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ సర్వీస్ ప్రొవైడర్స్ లో ఒకటి జియో ఫైబర్. చాలా తక్కువ సమయంలోనే ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ను బీట్ చేసింది. తన దైన ఆఫర్లతో వారికంటే ముందు నిలిచింది.
టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టించింది. తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా, ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. జియో దెబ్బకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు దిగొచ్చాయి. ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్లో జియో ఫైబర్ను ప్రకటించి రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది. జియో ఫైబర్తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది. జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్లో 999, 1499, 2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణ పొందా
Wednesday, July 21, 2021
బంగారు పూత పూసిన ఫెరారీ కార్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన బంగారు పూత పూసిన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపైన ‘ఇండియన్ అమెరికన్ విత్ ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్’ అని నోట్ రాసి ఉంది. దీనిపై ఆనంద్ మహీంద్రా తన ట్విటర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప.. ఇంకా ఏ విషయంలో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందో?’’ అని ఆయన ట్విటర్లో వ్యాఖ్యానించారు. ఈ పోస్టును 24 గంటల్లో 1,69,300 మంది వీక్షించారు. వీరిలో 6,000 మంది లైక్ చేశారు.
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...