బ్రిటన్కు చెందిన ఈ ఎలక్ట్రానిక్ బ్రాండ్ నుంచి భారత్లో విడుదలైన మొట్టమొదటి ఇయర్బడ్స్. వీటిని మాజీ వన్ప్లస్ ఎగ్జిక్యూటివ్ కార్ల్ పీ ఆవిష్కరించారు. నథింగ్ నుంచి బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఇయర్ఫోన్లను విడుదల చేస్తున్నారు. తద్వారా వీటికి గ్లోబల్ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా విడుదలైన ఇయర్బడ్స్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్లెస్ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో నథింగ్ ఇయర్ (1) ఇయర్బడ్స్ను రూ. 5,999 ధర నిర్ణయించింది. గ్లోబల్ మార్కెట్లో కంటే వీటి ధర భారత్లోనే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఇవి EUR 99 (సుమారు రూ .8,700) ధర వద్ద లభిస్తాయని పేర్కొంది. భారత దేశంలో ఈ ధర వద్ద లభిస్తున్న ఒప్పో రియల్మీ బ్రాండ్లకు చెందిన ఇయర్బడ్స్కు నథింగ్ ఇయర్ (1) గట్టి పోటీనివ్వనుంది. వీటిని ఆగస్ట్ 17 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
0 Comments