Ad Code

రెండు లక్షలకు చేరిన కియా సెల్టోస్ సేల్స్!

భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కియా ఇండియా అత్యంత వేగంగా అరుదైన మైలురాళ్లను అధిగమిస్తోంది. భారత్‌లో ఇప్పటికే మూడు లక్షల సేల్స్‌ను నమోదు చేసిన కియా తన ఫ్లాగ్‌షిప్ సెల్టోస్ ఎస్‌యూవీ సేల్స్ రెండు లక్షలకు చేరుకుంది. భారత్‌లో కంపెనీ మొత్తం అమ్మకాల్లో కియా సెల్టోస్ నుంచే 66 శాతం అమ్మకాలు సమకూరుతున్నాయి. మొత్తం అమ్మకాల్లో కియా సెల్టోస్ డీజిల్ యూనిట్ సేల్స్ 45 శాతంగా ఉన్నాయి. ఇటీవల లాంఛ్ చేసిన సెల్టోస్ ఐఎంటీ సేల్స్ కూడా ప్రోత్సాహకరంగానే సాగుతున్నాయని కియా ఇండియా సేల్స్‌, బిజినెస్ స్ట్రాటజీ చీఫ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టేజిన్ పార్క్ పేర్కొన్నారు. భారత కస్టమర్ల అభిరుచుల్లో మార్పుల కారణంగా దేశ ప్రయాణీకుల వాహన మార్కెట్ మారుతోందని, అత్యాధునిక ఫీచర్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని కస్టమర్లు కోరుతున్నారని అన్నారు. రెండేండ్లలోనే కియా బ్రాండ్ పట్ల కస్టమర్లు చూపుతున్న ఆదరణ, విశ్వాసం తమకు సంతృప్తి కలిగిస్తోందని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu