ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ జియోమీ నుంచి సరికొత్త ఫీచర్లలో మరో ఫోన్ రాబోతోంది. జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ త్వరలో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 29న ఈ ఫోన్ను ఇండియాలో జియోమీ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్కు సంబంధించిన డిజైన్, ఫీచర్లను కంపెనీ విడుదల చేసింది. తాజాగా.. రిలీజ్ డేట్, ధర, ఇతర స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ప్రారంభ మోడల్ ధర రూ.21,999 గా ఉంటుందని సమాచారం. 6జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. అలాగే.. నాలుగు కలర్స్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
0 Comments