Ad Code

భారత అమ్ములపొదిలోకి 118 అర్జున MK-1A ట్యాంకులు


భారత ఆర్మీ కోసం.. 118 మెయిన్​ బ్యాటిల్​ ట్యాంక్స్​, Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్​ ఫ్యాక్టరీ)తో గురువారం రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 7,523కోట్లు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఈ ఆర్డర్ మరింత ఊతమిస్తుందని మరియు ఆత్మ నిర్భర్ భారత్ ని సాధించే దిశలో ఇదొక పెద్ద అడుగు అని రక్షణశాఖ పేర్కొంది. ఈ ట్యాంకర్లు సైన్యానికి అదనపు శక్తిగా నిలుస్తాయని రక్షణశాఖ తెలిపింది. MBT Mk-1A..అర్జున్ ట్యాంక్ యొక్క కొత్త వేరియంట్ అని తెలిపింది. MK-1 వేరియంట్​తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉంటాయని రక్షణశాఖ తెలిపింది. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు యుద్ధ ట్యాంకుల్లో ఉందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu