భారత్లో కార్యకలాపాలు ప్రారంభించి పదేండ్లు కావడంతో రెనాల్ట్ ఇండియా దేశీ కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో కొన్ని సెప్టెంబర్ నెల మొత్తం అమలు కానుండగా మరికొన్ని ఆఫర్లు నిర్ణీత వ్యవధి వరకే వర్తించనున్నాయి. బై నౌ..పే ఇన్ 2022 స్కీమ్ సహా కస్టమర్లకు రెనాల్ట్ భారీ ఆఫర్లను అందచేస్తోంది. క్యాష్ ఆఫర్లు, లాయల్టీ బోనస్ వంటి ప్రోత్పాహకాలు ఆఫర్ చేస్తోంది. రెనాల్ట్ కార్లలోని ఎంపిక చేసిన వేరియంట్లపై రూ 80,000 వరకూ ప్రయోజనాలను కస్టమర్లకు కంపెనీ వర్తింపచేస్తోంది. భారత్లో కంపెనీ ఆపరేషన్స్ ప్రారంభమై పదేండ్లు కావడంతో పది యూనిక్ లాయల్టీ రివార్డ్స్ను అందిస్తోంది. గణేష్ చతుర్ధి సందర్భంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా కస్టమర్ల కోసం రెనాల్ట్ ఇండియా నిర్ధిష్ట ఆఫర్లను ప్రకటించింది. ఇక బై నౌ..పే ఇన్ 2022 స్కీమ్ కింద రెనాల్ట్ కారును కొనుగోలు చేసిన కస్టమర్లు ఆరు నెలల తర్వాత నుంచి ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, కైగర్ కార్ల కొనుగోలుకు వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.
0 Comments