Ad Code

రూ.20 వేల షియోమీ టీవీ కేవలం 4000 లకే..!



దీపావళికి ప్రత్యేకమైన ఫెస్టివల్ ఆఫర్స్.. ఫ్లిప్ కార్ట్ సంస్థ కొన్ని ఆఫర్లను ప్రకటిస్తోంది. అందులో ముఖ్యంగా మొబైల్, స్మార్ట్ టీవీ ల పై భారీ ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల పై కూడా మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గా సమాచారం. అయితే ఎవరైనా ఈ దీపావళి పండుగ కి స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారు ఈ ఆఫర్ ని తెలుసుకోవడం ఉత్తమం. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం కొన్ని ఆఫర్లను ప్రకటించింది. అందులో భాగంగా MI 4A PRO టీవీ అనే మోడల్ టీవీ ను అతి తక్కువ ధరకే అంటే కేవలం రూ.4,000 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈటీవీ అసలు ధర రూ.19,999 కాగా ఇందులో 25% డిస్కౌంట్ తో మనకి ఫ్లిప్ కార్డు లో 14,999 రూపాయల కి లభిస్తుంది. ఇక అంతే కాకుండా మరొక డిస్కౌంట్ తో కూడా ఈటీవీ మనకి లభించే అవకాశం ఉన్నది వాటి వివరాలను చూద్దాం. ఈ స్మార్ట్ టీవీ పై ఎక్సేంజ్ ఆఫర్ కింద 11 వేల రూపాయలను తగ్గించుకోవచ్చు. ఇక ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ఉన్నవారు 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉన్నవారు 5% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మనం ఈ టీవీకి ఈ ఆఫర్ ని ఉపయోగించుకున్నట్లయితే..4000 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా ఇతర బ్యాంకుల ఆఫర్లు కూడా ఇందులో లభిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈటీవీ పై ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక ఇందులో మరొక సదుపాయం ఏమిటంటే EMI సదుపాయాన్ని కూడా మనకు అందిస్తోంది. ఇక ఈ టీవీ విషయానికి వస్తే ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ని కలిగి ఉంది. ఇక ఈ స్మార్ట్ టీవీ కూడా గూగుల్ అసిస్టెంట్ తో పని చేస్తుంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో అనే విషయం మాత్రం ఫ్లిప్ కార్ట్ తెలియజేయలేదు.

Post a Comment

0 Comments

Close Menu