Ad Code

'బిగ్ దివాలీ'

  


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీపావళిని పురస్కరించుకుని 'బిగ్ దివాలీ' సేల్‌కు సిద్ధమవుతోంది. దసరాను పురస్కరించుకుని ఇటీవల 'బిగ్ బిలియన్ డేస్ సేల్'తో ముందుకు రాగా, అది ముగిసిన వెంటనే ఇప్పుడు దివాలీ సేల్‌తో డీల్స్, ఆఫర్లు మోసుకొచ్చింది. మొబైల్స్, ట్యాబ్లెట్స్, టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై ఆకట్టుకునే డీల్స్ ఆఫర్ చేస్తోంది. బిగ్ దివాలీ సేల్ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం అక్టోబరు 16న అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సెస్ బ్యాంకు యూజర్లకు 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లపై 80 శాతం, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం రాయితీ ఇవ్వనుంది. అలాగే, సేల్ మధ్యలో క్రేజీ డీల్స్, టైం-బాంబ్ డీల్స్ కూడా ఉంటాయి. 

Post a Comment

0 Comments

Close Menu