గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 10 లక్షల మంది ఉద్యోగులకు అపురూపమైన ఆఫర్ ఇచ్చింది. వారికి శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికిప్పుడు 2022 జనవరి ప్రారంభం నుంచి కార్పొరేట్ ఉద్యోగులందరినీ కార్యాలయానికి రమ్మని ఆదేశించాలని ప్రణాళికలు రూపొందించలేదని అమెజాన్ డాట్ కామ్ యాజమాన్యం పేర్కొన్నట్లు గీక్వైర్ వెబ్సైట్ వెల్లడించింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించడంపై తుది నిర్ణయం సంబంధిత విభాగం డైరెక్టర్దేనని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు పంపిన మెసేజ్లో పేర్కొన్నారు. కొన్ని సేవలకు సంబంధించి కస్టమర్ల నిర్ణయాన్ని బట్టి వర్క్ ఫ్రం హోం విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కస్టమర్లకు సేవలందించే విభాగంలో మెజారిటీ ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుందని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. సిబ్బంది కార్యాలయాలకు వచ్చే అంశంపై జనవరి మూడో తేదీన సంబంధిత టీమ్ల పర్యవేక్షకుల నుంచి గైడ్లైన్స్తో కూడిన నోటీసు వారికి అందుతుందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు ఆఫీసుకు రావాలని టీసీఎస్ ఆదేశించింది. సెప్టెంబర్లోనే విప్రో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలికింది.
0 Comments