ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్లు సౌమ్య జానా., శివ రామ కృష్ణ వంజర బృందం పరిశోధనను ఇటీవల ఫుడ్ అనలిటికల్ మెథడ్స్ జర్నల్ ను విడుదల చేసింది. ఈ బృందం మొదట పరిశోధన వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది పాలలో ఆమ్లతను కొలవడానికి సూచికగా కాగితాన్ని వినియోగించారు. కాగితంలో రంగు మార్పును ఖచ్చితంగా గుర్తించగల ప్రోటోటైప్ స్మార్ట్ ఫోన్ - అనుకూల అల్గోరిథంను అభివృద్ధి చేశారు. ఫోన్ కెమెరాను ఉపయోగించి పాలలో ముంచిన తర్వాత సెన్సార్ స్ట్రిప్స్ లోని రంగు మార్పును పరిశీలిస్తుంది. అంతే కాదు ఈ డేటా pH స్థాయిని తెలియజేస్తుంది. 'క్రోమాటోగ్రఫీ మరియు స్పెక్ట్రోస్కోపీ వంటి టెక్నిక్లను కల్తీని గుర్తించడానికి వినియోగిస్తారు. ఇటువంటి టెక్నిక్లకు సాధారణంగా ఖరీదైన సెటప్ అవసరం ఉంటుంది. తక్కువ ధరలో ఉపయోగించడానికి సులభమైన పరికరాలుగా సూక్ష్మీకరణకు అనుకూలంగా ఉండదు. పాలలో కల్తీని గుర్తించడానికి వినియోగదారుడు ఉపయోగించే సాధారణ పరికరాలను మనం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ పరిశోదన పుట్టుకొచ్చింది. ఖరీదైన సామగ్రి అవసరం లేకుండా... ఈ పారామీటర్లన్నింటినీ ఒకేసారి పర్యవేక్షించడం ద్వారా పాల కల్తీ అరికట్టవచ్చు'అని ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ చెప్పారు.
0 Comments