Ad Code

బీఎండబ్ల్యూ స్కూటర్‌

 

జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్‌ భారత్‌లో సి-400 జీటీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.9.95 లక్షలు. పూర్తిగా తయారైన స్కూటర్‌ను కంపెనీ భారత్‌కు దిగుమతి చేస్తోంది. సుదూర ప్రాంతాలకూ ఈ స్కూటర్‌పై సులభంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 34 హెచ్‌పీ పవర్‌తో వాటర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఫోర్‌ స్ట్రోక్‌ 350 సీసీ ఇంజన్‌ను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంది. గంటకు 139 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu