ముందుగా అమ్మవారి ఫోటో ఉంటే.. బాగా శుభ్రం చేయాలి. విగ్రహం ఉన్నా.. ఫర్వాలేదు. అయితే దీన్ని పీఠం మీద పెట్టుకోవాలి. ముందుగా ఒక నియమం తీసుకోవాలి. అదే రోజుకు రెండు మార్లు పూజ చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. పూజ చేసే ముందు అఖండ దీపం వెలిగించుకోవాలి. మొదట సంకల్పం చెప్పాలి. మీ మనస్సులో సంకల్పించుకోవాలి. అమ్మవారి చల్లని చూపు కోసం సంకల్పించుకోవడం ముఖ్యం. షోఢశోపచార వ్రతం వస్తే ఆచరించవచ్చు. వచ్చిన వారికి కాళ్లు కడుక్కోవడానికి నీరు ఇచ్చి, పసుపు, కుంకుమ వివిధ రకాల ఉపచారాలు చేయాలి. కుదరకపోయిన ఫర్వాలేదు. మనస్సులో అమ్మవారిని ఆహ్వానించాలి. మంత్రం చదవకపోయినా.. మనస్ఫూర్తిగా చేయాలి. లలితా సహస్త్రనామం, ఖడ్గమాల, సౌందర్య లహరి, కనకధార స్తోత్రం ఈ నాలుగు శ్రీవిద్యకు ఫేసేస్. అందులో లలితా సహస్త్రనామం చేసేటపుడు కుంకుమతో అర్చించాలి. మిగతావి చదువుకోవాల్సినవి. సౌందర్య శ్లోకాలు రోజుకు పది చదివితే సరిపోతుంది. ఈ రోజు అమ్మవారికి మల్లెపూలు, విరజాజిపూలతో పూజిస్తారు. మొదటి రోజు అమ్మవారిని రెండేళ్ల చిన్నారిగా పూజిస్తారు. నవరాత్రి మొదటిరోజు అమ్మకు పొంగల్ నైవేద్యం పెడతారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే.. శత్రువు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. సంపద వృద్ధి చెందుతుంది. మొదటిరోజు పూజా సమయం ఉదయం10.30-12.00 వరకు. సాయంత్రం 6.00 -7.30 వరకు.
0 Comments