Ad Code

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ...!

 


ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాల హావ కొనసాగుతూనే ఉన్నది. వీటి ధర కూడా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉన్నది. ఇక వీటి వారంతో పాటు గా పెట్రోల్ ధరలు కూడా అధికంగా పెరగడంతో సామాన్యులకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వీటితో పాటుగా వాయుకాలుష్యం ప్రతిరోజు కి పెరుగుతూనే ఉన్నది. అందుచేతనే ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలనే పెంచుకునేలా చేస్తూ ఉన్నారు. ఇక వీటి ద్వారా కూడా తక్కువ ధరలకే ఉండేలా చూస్తూ ఉన్నారు ఆయా సంస్థలు. ఇక అందుచేతనే సరి కొత్త కంపెనీలు కూడా తమ కంపెనీ నుంచి కొత్త బైక్ లను విడుదల చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం యువతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త డిజైన్లతో ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలో.. ఒకాయ ఎలక్ట్రిక్ సంస్థ కూడా ఒకటి. తమ ద్విచక్ర వాహనం లను హై స్పీడ్ తో కలిగే విధంగా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. మార్కెట్లోకి "FAST" అనే పేరుతో వీటిని విడుదల చేయడం జరిగింది. ఇక వీటి ధర విషయానికి..90,000 రూపాయలని తెలియజేశారు. ఇక వీటి గురించి మొత్తం.. ఒకయ గ్రూప్ MD అనిల్ తెలియజేయడం జరిగింది. ఇక ద్విచక్ర వాహనం విషయానికి వస్తే..65-75 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఇక ఈ బైక్ కి ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. కనిష్టంగా 140 నుంచి 200 కిలోమీటర్ల వరకు వెళుతుందట. ఇక ఈ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే..4.4 కిలో వాట్స్.. ఇక ఈ బ్యాటరీకి లిథియం పాస్పోట్ బ్యాటరీతో తయారుచేయబడింది. ఇక ఈ బైక్ ను కూడా రాబోయే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ బైక్ ను వెంటనే తీసుకోవాలంటే బుకింగ్ కొరకు 1999 రూపాయల తెలియజేయాలి అన్నట్లుగా సంస్థ తెలియజేసింది.

Post a Comment

0 Comments

Close Menu