కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్ననీనాగుప్తా. అదే కాలేజీలో మ్యాథ్స్లో పీజీ చేసింది. తర్వాత ఆల్జిబ్రాయిక్ జియోమెట్రీలో పీహెచ్డీ చేసి, ప్రొఫెసర్గా చేరింది. అంతుచిక్కని ప్రశ్నలకి సమాధాలు వెతకడాన్ని ఛాలెంజ్గా తీసుకునేది నీనా. 2014లోఆల్జిబ్రాయిక్ జియోమెట్రీలో 'జరస్కీ క్యాన్సిలేషన్ కంజెక్చర్' అనే చిక్కుప్రశ్నకి సమాధానం కనుగొన్నది. దాంతో ఆ ఏడాది తనకు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యంగ్ సైంటిస్ట్ విభాగంలో మెడల్ ఇచ్చారు. మ్యాథ్స్లోని మొండి ప్రశ్నకి సొల్యూషన్ చెప్పినందుకు ఇప్పుడు నీనాకు ప్రెస్టీజియస్ రామానుజన్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన నాలుగో ఇండియన్ తనే. అంత పెద్ద అవార్డు వచ్చింనందుకు ఆనంద పడుతూనే, కమ్యుటేటివ్ ఆల్జీబ్రా విభాగంలోని ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో ఉంది ఈ మ్యాథమెటీషియన్. ''చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. అయితే, డిగ్రీ చదివిన తర్వాత నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు మావాళ్లు. కానీ, లెక్కల మీద నాకున్న ఇంట్రెస్ట్ చూసి ఇంట్లో పెళ్లి ఊసెత్తలేదు. జరస్కీ క్యాన్సిలేషన్ కంజెక్చర్ ప్రాబ్లమ్ నాకు పీహెచ్డీ రోజుల నుంచే తెలుసు. అయితే, నేనే ఈ చిక్కుప్రశ్నకి సమాధానం కనుక్కుంటానని అనుకోలేదు. రామానుజన్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అయితే, మ్యాథమెటిక్స్లో సొల్యూషన్ చూపించాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి' అంటోంది నీనా గుప్త.
0 Comments