చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోమీకి చెందిన రెడ్మీ బ్రాండ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రాబోతోంది. రెడ్మీ నోట్ 11 ఎస్ పేరుతో భారత్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఫోన్లో అత్యాధునికమైన ఫీచర్లు ఉండనున్నాయి. జియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ఈ ఫోన్ వివరాలను ట్వీట్ చేశారు. ఈ ఫోన్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో రానున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ను గత సంవత్సరం అక్టోబర్లోనే చైనాలో రిలీజ్ చేశారు. ఈ ఫోన్ ఫీచర్లకు ప్రకటించనప్పటికీ.. ఈ ఫోన్ ఖచ్చితంగా 108 ఎంపీ కెమెరాతోనే రానున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. కొందరు మాత్రం 64 ఎంపీ రేర్ కెమెరాతో ఈ ఫోన్ను లాంచ్ చేస్తారు అని చెబుతున్నా ఈ ఫోన్ మాత్రం బెస్ట్ ఫీచర్లతోనే రానున్నట్టు తెలుస్తోంది. మీడియాటెక్ ఎస్వోసీ ప్రాసెసర్తో ఈ ఫోన్ రిలీజ్ కానుంది.
0 Comments