Ad Code

18లక్షల అకౌంట్లు బ్యాన్ !


ఐటీ రూల్స్ 2021ను ఉల్లంఘించిన అకౌంట్లను నవంబరులో బ్యాన్ చేసినట్లు వాట్సప్ స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం 17లక్షల 59వేల అకౌంట్లను తొలగించడంతో పాటు 602 గ్రీవెన్స్ రిపోర్టులు సబ్‌మిట్ చేశారు. ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. యూజర్ సేఫ్టీ ఆధారంగా నవంబరు నెలలో ఆరో నెల రిపోర్టు కూడా సబ్‌మిట్ చేశాం. ఇందులో వాట్సప్ నుంచి యాక్షన్ తీసుకోమంటూ వచ్చిన కంప్లైంట్లు ఉంటాయి. ఇదే ప్లాట్ ఫాం మీద దుర్భాషలాడిన వ్యక్తులపై తగిన యాక్షన్ తీసుకోవాలని ఉన్నట్లు ‘ కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది. అసభ్యపదజాలం వాడే కామెంట్లను ఫిల్టర్ చేయడంలో వాట్సప్ ఇండస్ట్రీలోనే లీడర్ గా మారింది. సంవత్సరాలుగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ లను పెట్టుబడిగా ఉంచి యూజర్ల సేఫ్టీని పర్యవేక్షిస్తుంది. అక్టోబరులో 20లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. అనధికారికంగా, బల్క్ మెసేజ్ లుగా చేసే 95శాతం స్పామ్ మెసేజ్ లకు చెక్ పెట్టింది వాట్సప్.

Post a Comment

0 Comments

Close Menu