ఇండోనేసియాలోని సెమరాంగ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థి సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘొజాలి (22) కు రోజూ సెల్ఫీ ని తీసుకునే అలవాటు. అయితే ఇలా సెల్ఫీ ని ఒకటే తీసుకుంటాడు. అదీ తన కంప్యుటర్ ముందు కూర్చుని.. రోజూ ఒకటే సెల్ఫీ తీసుకుంటాడు. ఇలా గత ఐదేళ్లుగా సెల్ఫీని తీసుకుంటూనే ఉన్నాడు. ఇలా తీసుకున్న సెల్ఫీలతో గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న సమయంలో తనలో వచ్చిన మార్పులు అంటూ ఓ టైమ్లాప్స్ వీడియో చేయడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సుల్తాన్ గుస్తాఫ్ దృష్టిలో ‘నాన్ ఫంజిబుల్ టోకెన్’ వార్తలపై పడింది. వెంటనే ఎన్ఎఫ్టీలకు వెబ్సైట్లో ఖాతా తెరిచాడు. ఎన్ఎఫ్టీ అంటే ట్వీట్లు, పాటలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు ఉపయోగించే ఒక ఆన్ లైన్ సాధనం. దీంతో సుల్తాన్ తన సెల్ఫీలను ‘ఘొజాలి ఎవిరీడే’ పేరుతో జనవరి 10వ తేదీన 933సెల్ఫీ లను అమ్మకానికి పెట్టాడు. ఒకొక్క సెల్పి ధర 3 డాలర్లని చెప్పాడు.సెల్ఫీని తాను కొన్నట్లు సెలబ్రిటీ షెఫ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. వెంటనే సుల్తాన్ గుస్తాఫ్సెల్ఫీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం 11 రోజులల్లో అంటే జనవరి 21వ తేదీకి 500 మందికిపైగా సులాన్ట్ సెల్ఫీలను కొన్నారు. దీంతో సుల్తాన్ 384 ఎథెర్ కాయిన్స్ ను సంపాదించాడు. ఎథెర్ అంటే.. బిట్కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీ. 384 ఎథెర్ల విలువ భారత దేశ కరెన్సీ లో దాదాపు రూ.7.5 కోట్ల అన్నమాట. దీంతో ఆ యువకుడి సెల్ఫి సరదా ఏకంగా కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుడిని చేసింది.
0 Comments