సోషల్ మీడియాలో దూసుకుపోతున్న యాప్ ట్విట్టర్ కోట్లాది కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగాయి. దాంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో వెబ్సైట్ 'డౌన్ డిటెక్టర్' ట్విట్టర్కు అంతరాయం కలిగినట్లు తెలిసింది. ట్విట్టర్ సేవలలో ప్రపంచ వ్యాప్త అంతరాయానికి టెక్నికల్ బగ్ ఉందని, అయితే ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించినట్లు అయినప్పటికీ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయాలకు క్షమాపణలు చెబుతున్నామంటూ తెలియచేసింది ట్విట్టర్ యాజమాన్యం. ఈ మెసేజ్ ను ట్విట్టర్ రాత్రి 11.44 గంటలకు పోస్ట్ చేయడం జరిగింది. ట్వీట్లను పోస్ట్ చేయకుండా అదే విధంగా టైమ్ లైన్లను లోడ్ చేయకుండా, అడ్డుకునే సాంకేతిక బగ్ను పరిష్కరించినట్లు తెలియచేసారు. కాగా ఇపుడు మళ్ళీ ట్విట్టర్ ను యదావిధిగా యూజర్లు వినియోగించుకోవచ్చు అని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని పేర్కొన్నారు. ట్వీట్ చేయబడింది.
0 Comments