ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఫైబర్ వినియోగదారుల కోసం సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది.కొత్త ప్లాన్ ప్రకారం. 1000 జీబీ డేటాను కేవలం రూ. 329 కే సంస్థ అందిస్తోంది. 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ డేటా వాడుకోవచ్చు. ఇది నెల రోజుల కాలపరిమితితో కూడిన బేసిక్ ప్లాన్. ఒకవేళ నెలరోజుల్లోపు వెయ్యి జీబీ డేటా అయిపోతే ఆ తర్వాత బ్రాడ్ బ్యాండ్ వేగం తగ్గుతుంది. అంతేకాక, ఈ బేసిక్ ప్లాన్ ద్వారా కస్టమర్లు ఏ ఇతర నెట్వర్క్కి అయినా లోకల్, ఎస్టీడీ కాల్స్లను ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ను ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అమలు చేస్తారో వేచి చూడాలి.
0 Comments