చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ పోకో తన బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకు రానున్నది. పోకో ఎక్స్ ప్రో 5జీ పేరుతో రాబోయే ఫోన్ మార్చి 28న దేశంలో విడుదల కానున్నది. ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్లో స్మార్ట్ఫోన్ డిజైన్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్ను వెల్లడిస్తూ పోస్టర్ను కూడా షేర్ చేసింది. పోకో ఎక్స్ ప్రో 5జీ ఇండియా వేరియంట్ టీజర్ ప్రకారం ఇది 64-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ను కలిగి ఉంటుంది. ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022లో Poco M4 Pro 4Gతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాండ్సెట్ ప్రారంభించబడింది. Poco X4 Pro 5G యొక్క గ్లోబల్ వేరియంట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ను కలిగి ఉంది.
0 Comments