Ad Code

జియో నుంచి అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌


రిలయెన్స్ జియో నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రారంభం అయింది. దీనికి జియో క్యాలెండర్ మంత్ వాలిడిటీ అనే పేరు పెట్టింది. రూ.259 చెల్లిస్తే ఈ రీచార్జ్ ప్లాన్ ప్రకారం సరిగ్గా నెల రోజుల పాటు అంటే క్యాలెండర్ నెల వరకు అన్‌లిమిటెడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నారు. సాధారణంగా జియోలో రీచార్జ్ ప్లాన్స్ 28 రోజులకే ఉంటాయి. కానీ.. రూ.259తో క్యాలెండర్ నెలలో ఉండే రోజులకు ఈ ప్లాన్‌ను వర్తింపజేస్తారన్నమాట. ఉదాహరణకు ఏప్రిల్ 5న రూ.259తో రీచార్జ్ చేసుకుంటే.. మే 5 వరకు వాలిడిటీ ఉంటుంది. మే 5న మళ్లీ చేసుకుంటే.. జూన్ 5 వరకు ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అల్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్స్ చేసుకోవచ్చు. రూ.259 ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ప్రతి నెల ఒకే రోజు యూజర్లు రీచార్జ్ చేసుకునేలా ఈ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఒకసారి ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. ప్రతి నెల ఆ ప్లాన్ ఆటోమెటిక్‌గా రెన్యువల్ అవుతుంది. గత వారం జియో.. రూ.555, రూ.2999 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్స్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా అందిస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu