Ad Code

జూన్‌లో దేశీ మార్కెట్‌లోకి ఒప్పో రెనో 8 సిరీస్‌ !


ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్‌లు జూన్ మాసాంతంలో భారత్‌లో విడుదల కానున్నాయి. తొలుత చైనాలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఒప్పో పాడ్ ట్యాబ్లెట్‌, మల్టిపుల్ ఐఓటీ ఉత్పత్తులు కూడా భారత్‌లో విడుదల కానున్నాయి. రెనో 8 సిరీస్ పోన్లు ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో 6.5 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగిఉంటాయి. డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. రెనో 8 సిరీస్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను వాడుతోంది. 80డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో 4500ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇక ఈ స్మార్ట్‌పోన్ సిరీస్ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్‌, 2 మెగాపిక్సెల్ థర్డ్ సెన్సర్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. మరోవైపు రెనో 8 సిరీస్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్709 సెన్సర్‌తో ముందుకు రానుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu