రిలయన్స్ జియో ఇప్పటికే కొత్త పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం ఆరు కొత్త జియోఫైబర్ ప్లాన్ లను ప్రకటించింది. ఈ జియోఫైబర్ ప్రారంభ ప్లాన్లు రూ.399 నుంచి రూ. 3,999 వరకు అందుబాటులో వున్నాయి. ఈ ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు ఉచితంగా సెట్-టాప్ బాక్స్, ఇన్స్టాలేషన్ కు అర్హులు. ఈ కొత్త ప్లాన్లు ఏప్రిల్ 22 నుంచి అందుబాటులోకి రానున్నాయి. పోస్ట్పెయిడ్ ప్లాన్లు రూ. 399, రూ. 699, రూ. 999, రూ. 1499, రూ. 2499, రూ. 3999 ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్లు ఈ వారం చివరిలో అధికారిక వెబ్సైట్ MyJio యాప్లో అందుబాటులో ఉంటాయి. రిలయన్స్ జియో ఇంకొన్ని ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. రూ. 100, రూ. 200 అదనంగా 14 ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫారమ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. ఈ ఎంటర్ టైన్మెంట్ యాప్లలో Disney+ Hotstar, Zee5, Sonyliv, Voot, Sunnxt, Discovery+, Hoichoi, Altbalaji, Eros Now, Lionsgate, ShemarooMe, Universal+, Voot Kids JioCinema ఉన్నాయి. జియో ఈ ప్లాన్లను ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ప్లస్ అని అంటోంది. ఈ కొత్త JioFiber పోస్ట్పెయిడ్ ప్లాన్లలో ఏదైనా ఎంచుకునే కస్టమర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 10,000 కన్నా ఎక్కువ విలువైన ఉచిత గేట్వే రూటర్, సెట్-టాప్ బాక్స్ ఇన్స్టాలేషన్ను పొందవచ్చు.
0 Comments