టెలికాం రంగంలో రెండవ అతిపెద్ద టెల్కో భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.1,099 ప్లాన్లోని ప్రత్యేకత ఏటంటే పోస్ట్పెయిడ్ కనెక్షన్ కాకపోవడం. ఎయిర్టెల్ సంస్థ బ్లాక్ ప్లాన్లను ప్రకటించినప్పుడు టెల్కో అందించే అన్ని ప్లాన్లకు పోస్ట్పెయిడ్ కనెక్షన్ ఉంది. Airtel బ్లాక్ ప్లాన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఎయిర్టెల్ యొక్క పోస్ట్పెయిడ్ వినియోగదారుగా మారడం తప్పనిసరి. కానీ రూ.1,099 ప్లాన్తో పోస్ట్పెయిడ్ కనెక్షన్ కు మారవలసిన అవసరం లేదు. రూ.1,099 ధర తో లభించే ఎయిర్టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ వినియోగదారులకు ఒకే కనెక్షన్ తో ఫైబర్+ల్యాండ్లైన్ మరియు DTH (డైరెక్ట్-టు-హోమ్) కనెక్షన్ని అందిస్తుంది. ఈ ప్లాన్లో ఫైబర్ కనెక్షన్తో ఇంటర్నెట్ స్పీడ్ ని 200 Mbps వరకు పొందవచ్చు అని టెల్కో వెబ్సైట్లో పేర్కొనబడింది. అయితే ఈ ప్లాన్ను పొందడానికి ప్రాథమిక పోస్ట్పెయిడ్ కనెక్షన్ అవసరం ఉండకపోవచ్చు కావున ఇది మంచి విషయం అనిచెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు నిబంధనలు మరియు షరతులు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఈ ప్లాన్ ప్రయోజనాలలో లేనందున దానితో ఎటువంటి పోస్ట్పెయిడ్ కనెక్షన్ ప్రమేయం లేనట్లు కనిపిస్తోంది. ఎయిర్టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ మొబైల్ సేవలను కాకుండా టెల్కో యొక్క ఫైబర్ మరియు DTH సేవలను వినియోగించాలనుకునే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసినట్లు స్పష్టంగా ఉంది. ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్లో రూ.350 విలువైన టీవీ ఛానెల్లు చేర్చబడ్డాయి. దానికి అదనంగా అమెజాన్ ప్రైమ్ మరియు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్ రెండింటికీ ఒక-సంవత్సరంపాటు ఉచిత సబ్స్క్రిప్షన్ ను కూడా చేర్చబడింది. ఇప్పటికే ఉన్న ప్లాన్కు కొత్త సర్వీస్ను జోడించడం వల్ల వినియోగదారులు నెలకు రూ. 300 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ వినియోగదారులకు సౌకర్యాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ విభాగంలో టెల్కో తన ఉత్పత్తులు/సేవలను వినియోగదారులకు బండిల్ చేయబడి అందిస్తోంది కావున వారికి ఒకే బిల్లు సౌకర్యం ఉంటుంది. ఇంకా IVR నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి మరియు వారు ఉపయోగించాలనుకుంటున్న సేవలను ఎంచుకునే స్వేచ్ఛను తగ్గించడానికి Airtel బ్లాక్ ప్లాన్ కస్టమర్ల కోసం ప్రత్యేక కస్టమర్ కేర్ టీమ్ ఉంది. మరిన్ని వివరాల కోసం మీరు Airtel వెబ్సైట్ను చూడవచ్చు.
0 Comments