ఇటీవలే ట్విట్టర్లో ఎక్కువ షేర్లు దక్కించుకున్న ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విట్టర్ తన ఉనికిని కోల్పోతున్నట్లుందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ను మరింత మందికి చేరువ చేస్తానని చెప్పాడు. తాజాగా ట్విట్టర్ ఉనికి కోల్పోతున్నట్లుందని ట్వీట్ చేశాడు. అలాగే ట్విట్టర్ బ్లూ యూజర్లు ఈ ప్లాట్ఫామ్ను తక్కువగా వాడుతున్నారని, వీళ్లు మరింత ఎక్కువగా ట్విట్టర్ వాడేలా చేసేందుకు సలహాలు కావాలని కోరాడు. '90 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న స్విఫ్ట్ టేలర్ మూడు నెలలుగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. 114 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జస్టిన్ బీబర్ ఈ ఏడాది ఒకే ట్వీట్ చేశాడు. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు మాత్రమే ట్వీట్ చేస్తున్నారు. అందుకే టాప్ యూజర్లు ఎక్కువగా ట్విట్టర్ వాడేలా చర్యలు తీసుకుంటానని ఎలన్ మస్క్ చెప్పాడు. త్వరలో ట్విట్టర్లో ఎడిట్ బటన్ కూడా రాబోతుంది.
0 Comments