Ad Code

జూన్ 24న ఆకాశంలో అద్భుత దృశ్యం !


ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. జూన్ 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. అయితే, అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్‌ల ద్వారా చూడొచ్చని, తెల్లవారు జామున ఐదుగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపించనున్నాయి. ఈ అరుదైన దృశ్యం 18 సంవత్సరాల తర్వాత కనిపించనున్నది. ఇంతకు ముందు చివరి సారిగా 2004 డిసెంబర్‌లో కనిపించింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. ఐదు గ్రహాలు సరళ రేఖలోకి రావడం చాలా అరుదని స్కై అండ్‌ టెలిస్కోప్‌ అబ్జర్వింగ్‌ ఎడిటర్‌ డయానా హన్నికెన్‌ తెలిపారు. ఈ గ్రహాలు చివరిసారిగా 2004లో కనిపించాయని, మళ్లీ 2040లోనే కనిపిస్తాయన్నారు. జూన్‌ మాసం గడిచేకొద్దీ బుధగ్రహాన్ని సులభంగా చూడొచ్చని, ఈ నెల 24న ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చన్నారు. సూర్యోదయానికి అరగంట ముందు ఈ ఖగోళ అద్భుతం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. తూర్పు వైపు హోరిజోన్‌లో ఈ దృశ్యాన్ని బైనాక్యులర్‌ సహాయం చూడొచ్చని వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu