చైనా లోని ఒక కంపెనీ డ్రైవర్ లేకుండా ఎలక్ట్రిక్ రోబో టాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది అపోలో గో యాప్ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ నడుపుకుంటుందట. అయితే ఈ టాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 అనగా 37 వేల డాలరర్లు. ఈ టాక్సీ లో సాధారణ కారుల మాదిరిగా స్టీరింగ్ ఉండదు. స్టీరింగ్ ఉండకపోవడంతో ఈ టాక్సీలో ప్లేస్ మరింత విశాలంగా ఉంటుంది. అందులో ప్రయాణించే ప్రయాణికులకు అదనపు స్థలం కూడా లభిస్తుంది. అయితే డ్రైవింగ్లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడుపుతాడో అదే తరహాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ నడుపుతుందని బైడూ సంస్థ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయట. యాప్ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. ఈ టాక్సీని 2023 నాటికి మార్కెట్ లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ సంస్థ చెబుతోంది. అయితే ఈ రకం టాక్సీలను కనీసం లక్ష క్యాబ్లను తీసుకొస్తామని అంటోంది. రోబో ట్యాక్సీ తయారీ గూగుల్కు చైనా ఇచ్చిన సమాధానమని బైడూ సీనియర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. చైనాలో అపోలో గో యాప్ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. అపోలో ఆర్టీ6లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్ లను కూడా చేతితో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ కనెక్షన్ లేదా యాప్ ద్వారా తెరవొచ్చు.చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్ సెన్సింగ్ లైట్ డిటెక్షన్, రేంజింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అయితే మనుషులు అయితే ఎదురుగా వచ్చే కార్లను సిగ్నలను పాటిస్తారు మరి ఈ కార్లు ఎలా పాటిస్తాయి అన్న విషయానికి వస్తే..ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ లీ చెప్పారు. కాగా 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది.
0 Comments