Ad Code

ఎలక్ట్రిక్ బుల్లెట్ బండ్లు ?


ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ఎన్ ఫీల్డ్ కూడా రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది. దీనిపై రాయల్ఎన్ ఫీల్డ్ సంస్ధ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ స్పందించారు. 2025-26 నాటికి తమ కంపెనీ నుంచి ఈ బైక్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా గడువు అంటూ ఏం ఉండదని, అయితే కచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ బైక్ కాన్సెప్టు బైక్ పై ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో పరిశోధన జరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ ఫాంలపై విద్యుత్ ఆధారిత బైక్ ను నిర్మించడమా లేదా కొత్త ఫ్లాట్ ఫాం రూపొందించడమా అనేది డిసైడ్ అవుతామని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu