Header Ads Widget

రాజస్థాన్‌లో జియో 5G సేవల ప్రారంభం


రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ 5G సేవలను ప్రారంభించారు. నేటి నుంచి నాథ్‌ద్వారాతో పాటు చెన్నైలో కూడా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి అని ఆకాష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత నెలలో ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం నుండి రాష్ట్రంలో 5G సేవలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 2015లో కూడా ముఖేష్ అంబానీ 4G సేవలను ప్రారంభించే ముందు శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించారు.

Post a Comment

0 Comments