Ad Code

డిసెంబర్​ 12న వన్‌ప్లస్‌ నుంచి రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లు !


వన్‌ప్లస్‌ డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలో అడుగుపెడుతోంది. డిసెంబర్​ 12న కొత్తగా రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. వన్‌ప్లస్‌ మానిటర్ ఎక్స్ 27, వన్‌ప్లస్‌ మానిటర్ ఈ24 పేర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్​ పేజీలో పెట్టిన టీజర్​లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రకటించింది. ఉచితంగా మానిటర్లను గెలుచుకునేందుకు ఒక లక్కీడ్రాను కూడా కంపెనీ నిర్వహిస్తోంది. వన్‌ప్లస్‌ ఎక్స్​27 మానిటర్​ మోడల్​ 27 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వన్‌ప్లస్‌ ఎక్స్​ 24 మోడల్​ 24 ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. వీటిలో ఓ మోడల్​ పోట్రయిడ్​ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ అదిరిపోతుందని వన్‌ప్లస్‌ తన టీజర్​లో పేర్కొంది. అయితే వీటి ధరలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఎక్స్​ 27 మానిటర్​ ప్రీమియం రేంజ్​, ఈ24 మానిటర్ మిడ్‌రేంజ్‌లో లభించనున్నాయి. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్‌లను రూ.20,000 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu