హైదరాబాద్కు చెందిన ప్యూర్ ఈవీ స్టార్టప్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్యూర్ ఈవీ ఎకో డ్రిఫ్ట్ పేరుతో బైక్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతొ రూపొందించారు. ఈ బ్యాటరీని ప్యూర్ ఈవీ సంస్థ స్వయంగా తయారు చేయడం విశేషం. ఈ బైక్ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే నాన్స్టాప్గా 135 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గంటకు 75 కి.మీల వేగంతో దూసుకెళ్లడం ఈ బైక్ ప్రత్యేకత. ఇంతటి స్పీడ్లో వెళ్లినా బైక్లో ఎలాంటి షేక్స్ ఉండవని కంపెనీ చెబుతోంది. సాధారణ బైక్లతో పోల్చితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎందులోనూ తీసుపోదని చెబుతున్నారు. జనవరిలో ధరను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ బైక్లో 18 ఇంచెస్ ఫ్రంట్, 17 ఇంచెస్ రెయిర్ అలాయ్ వీల్స్ను ఇవ్వనున్నారు. రెడ్, గ్రే, బ్లూ మూడు రంగుల్లో బైక్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 5 సెకండ్లలో 0 నుంచి 40 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవడం మరో విశేషం.
0 Comments