Ad Code

టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు టిగోర్ !


టాటా కంపెనీ నుంచి విడుదలైన నెక్సన్ ఈవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే టాటా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్  కారును విడుదల చేశారు. టాటా టిగోర్ మోడల్ ని ఎలక్ట్రానిక్ వర్షన్ లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి నెలలోనే ఈ టిగోర్ ఈవీ మోడల్ కు మొత్తం 20 వేలకు పైగా బుకింగ్స్ లభించినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.  ఇప్పుడు ఈ కాారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫీచర్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ టిగోర్ ఈవీ 2022 ఎక్స్ షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మ్యాగ్నెటిక్ రెడ్ కలర్ లో కూడా ఈ మోడల్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఈవీ మోడల్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. 26 కిలోవాట్స్ సామర్థ్యంతో బ్యాటరీ లభిస్తోంది. ఈ బ్యాటరీలకు 8 ఏళ్ల వారెంటీ కూడా ఇస్తున్నారు. ఈ 5 సీటర్ లో 316 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తోంది. ఈ సెడాన్ 172 గ్రౌండ్ క్లియరెన్స్ అన్ లాడెన్ తో వస్తోంది. ఈ 26 వాట్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 7.5 గంటలుA.C), 59 నిమిషాలు(D.C) సమయం పడుతుంది. హైవేలపై బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్ స్టాల్ చేస్తే రాబోయే కార్లన్నీ ఈవీలే అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క టాటానే కాకుండా మహింద్రా వంటి కంపెనీలు కూడా ఈవీ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. మార్కెట్ లో నెలకొన్ని డిమాండ్, పోటీకి తగ్గట్లు కంపెనీలు సరికొత్త మోడల్స్, ఫీచర్లతో ఎలక్ట్రికల్ కార్లను తీసుకొస్తన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu