Ad Code

మొట్ట మొదటి ల్యాప్‌టాప్ 11 కేజీల బరువు, లక్షలన్నర ఖరీదు !


ప్రపంచంలో మొట్టమొదటి పర్సనల్ డెస్క్ టాప్ కంప్యూటర్ ను ఇటాలియన్ కంపెనీ ఒలివెట్టి 1964లో తయారు చేసింది. దీని ధర దాదాపు రూ.రెండు లక్షలు. ప్రపంచంలోని మొట్టమొదటి ల్యాప్ టాప్ 1981లో తయారు అయింది, దీనిని ఓస్ బోర్న్ కంప్యూటర్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ ల్యాప్ టాప్ ఆ సమయంలో పోర్టబుల్ మైక్రో కంప్యూటర్ గా ఉండేది. ఈ ల్యాప్ టాప్ లో ఐదు అంగుళాల స్క్రీన్ ఉండేది. దాని బరువు 11 కిలోలుగా ఉంది. ఈ మొదటి ల్యాప్ టాప్ బరువు ఐదు యాపిల్ మ్యాక్ బుక్ ప్రోలకు సమానం. అయినప్పటికీ అధిక బరువు, అధిక ధర కారణంగా ఇది పెద్దగా విజయవంతం కాలేదు. ఈ మొదటి పోర్టబుల్ ల్యాప్ టాప్ ధర 1795 డాలర్లు అంటే నేటి రూపాయి విలువ ప్రకారం రూ.1,46,775. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాప్టాప్ విలువ దాదాపు రూ.1.5 లక్షలు అన్నమాట. ఓస్ బోర్న్ ల్యాప్ టాప్ తర్వాత రెండో పోర్టబుల్ ల్యాప్ టాప్ 1983లో లాంచ్ అయింది. దీనికి గ్రిడ్ కంపాస్ 1101 అని పేరు పెట్టారు. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉండేది, ఇది మార్కెట్లో విజయవంతం కాలేదు. దీని తర్వాత Compaq LTE, Compaq LTE 286 ల్యాప్ టాప్ లు 1990లో మార్కెట్లోకి వచ్చాయి. పాత ల్యాప్ టాప్ ల కంటే ఇవి చాలా తేలికైనవి. వీటిని ప్రయాణంలో సులభంగా తీసుకువెళ్లవచ్చు. యాపిల్ కంపెనీ ఉత్పత్తులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. యాపిల్ తన మొదటి ల్యాప్ టాప్ ను 1989లో లాంచ్ చేసింది. నేడు వస్తున్న Apple ల్యాప్ టాప్ లు తేలికగా, చిన్నవిగా ఉన్నాయి. ఆ సమయంలో యాపిల్ ల్యాప్టాప్ ఇప్పటి వెర్షన్ కంటే చాలా పెద్దది, భారీగా ఉండేది. దాని బ్యాటరీ, స్క్రీన్ ఇతర ల్యాప్ టాప్ ల కంటే కొంచెం మెరుగ్గా ఉండేవి. దీని తరువాత యాపిల్ 1991లో పవర్ బుక్ ల్యాప్ టాప్ సిరీస్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మూడు ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పవర్ బుక్ 100, పవర్ బుక్ 140, పవర్ బుక్ 170 ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu