వివో వీ 27 సిరీస్ను మార్చి 1న భారత్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మెరుగైన కెమెరా ఫీచర్లను కోరుకునే కస్టమర్లు లక్ష్యంగా రానున్న వివో వీ 27 పిక్సెల్ 6ఏకు దీటైన పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. రూ. 30,000 ధరలో పిక్సెల్ 6ఏ మెరుగైన కెమెరా ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఇక వివో వీ27 సిరీస్లో భాగంగా వివో వీ27, వీ27ప్రొను కంపెనీ విడుదల చేయనుంది. అధికారిక ఈవెంట్కు ముందు లేటెస్ట్ 5జీ ఫోన్ డిజైన్తో పాటు కొన్ని ఫీచర్లనూ కంపెనీ వెల్లడించింది. వి సిరీస్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు ఈ సిరీస్లో ఇతర ఫోన్లతో పోలిస్తే ఖరీదైనవిగా చెబుతున్నారు. వివో వీ27 సిరీస్లో 5జీ ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకట్టుకోనుంది. రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్లో సెన్సర్లను అమర్చారు. వివో లేటెస్ట్ డివైజ్లు స్లిమ్, లైట్వెయిట్ డిజైన్తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. పంచ్ హోల్ డిజైన్తో ముందు భాగంలో కర్వ్డ్ డిస్ప్లే కనిపిస్తుంది. వివో ఫోన్లలో మెరుగైన కెమెరా ఫీచర్లు ప్రత్యేకత కావడంతో వివో వీ 27 సిరీస్లోనూ ఈ ఫీచర్ ఆకట్టుకునేలా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్లు మెరుగైన పోర్ట్రయిట్ షాట్స్ ఆఫర్ చేస్తాయని టీజర్లో వెల్లడైంది. వివో వీ27 సిరీస్ ఫోన్లు గ్రేడియంట్ ఫినిష్లతో ఆకట్టుకోనున్నాయి. వివో వీ 27 స్మార్ట్ఫోన్ రూ. 30,000లోపు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments