బెంగళూరుకు చెందిన గ్రీన్ టైగర్ మొబిలిటీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ తో నడిచే బైక్స్ ను ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇలా రెండింటితో నడిచే హైబ్రిడ్ స్కూటర్ గా ఈ స్కూటర్స్ ఆటోమొబైల్ రంగంలో చరిత్ర సృష్టించనున్నాయి. 125ccలో వస్తున్న ఈ స్కూటర్స్ ఇప్పటికే ARAI & RTO ఆమోదం కూడా పొందడం జరిగింది. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కూటర్లకు, మోటార్ సైకిళ్లకు డ్యూయల్ పవర్ట్రెయిన్ ఇంజన్లను ఈ కంపెనీ ఫిక్స్ చేసింది. ఇక మార్చబడిన వాహనాలలో ICE పవర్ట్రెయిన్, ఎలక్ట్రిక్ కిట్ లు రెండూ కూడా ఉంటాయి. రైడర్ తమకు నచ్చినట్లు ఎలక్ట్రిక్ & పెట్రోల్ మోడ్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్, పెట్రోల్ మోడ్ లో మాక్సిమం 60 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. గ్రీన్ టైగర్ ద్వారా మార్చబడిన వాహనాలు సాధారణ హైబ్రిడ్ 2-వీలర్ల కంటే డిఫరెంట్ గా ఉండనున్నాయి. ICE, ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఒకదానికొకటి సెపెరేట్ గా ఉంటాయి. అయితే బండి ఏదైనా ఒక మోడ్లో ఉంచినట్లైతే అది ఆ ఇంజన్ లేదా మోటార్ పనిచేస్తుంది. రైడర్ చాలా సులభంగా ఇతర మోడ్కి మార్చుకుని తన ప్రయాణాన్ని కూడా ఈజీగా కొనసాగించవచ్చు. ఈ స్కూటర్ రైడర్ తనకు అనువైన విధంగా మార్చేలా ఉపయోగపడనుంది. ప్రతి రోజూ కూడా ఎక్కువసార్లు రైడ్ చేసే వ్యక్తులకు ఈ డ్యూయల్-మోడ్ ఫంక్షన్ స్కూటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాకప్గా పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ మోడ్లో రైడింగ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలతో సవాలుగా ఉన్న రేంజ్ కూడా వస్తుంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment