యాపిల్ కంపెనీ వివిధ అప్డేట్స్తో ఎయిర్పాడ్స్ను అందుబాటులోకి తీసుకువస్తుంది. యాపిల్ కంపెనీ త్వరలో రిలీజ్ చేయబోయే ఎయిర్ పాడ్స్ ఓ ప్రత్యేక డిజైన్తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్పాడ్స్ను ఓ అంతర్నిర్మిత టచ్ స్క్రీన్ డిస్ప్లేను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఆడియోను నియంత్రించడంతో పాటు కనెక్ట్ చేసిన అప్లికేషన్ల పరస్పర చర్యల కోసం ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 2021లోనే దరఖాస్తు చేసింది. గత వారం యూఎస్ పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయం దీన్ని ధ్రువీకరించింది. ఈ టెక్నాలజీతో హెడ్ఫోన్ కేస్ యుటిలిటీని మెరుగుపరచవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఈ వైర్లెస్ హెడ్ఫోన్లతో వినియోగదారు నియంత్రణను మరింత మెరుగుపరచవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్లేబ్యాక్ నియంత్రణలు, ఆడియో మూలాలను మార్చడం, ఆడియో అవుట్పుట్ మోడ్లను మార్చడం వంటివి ఈ హెడ్ఫోన్స్ ద్వారా చాలా సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా డిస్ప్లే ద్వారా ఫోన్ నోటిఫికేషన్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎయిర్ పాడ్స్లో అదనపు మెమరీ మాడ్యూళ్లను కూడా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సరికొత్త ఆవిష్కరణపై యాపిల్ కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించ లేదు.
0 Comments