దేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల స్నాప్చాటర్ల మైలురాయిని చేరుకున్నట్లుగా స్నాప్ ఇన్ కార్పొరేషన్ నేడిక్కడ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ ప్రపంచ వృద్ధి మార్కెట్లలో భారత్ ఒకటి. స్థానికీకరించిన ప్లాట్ఫామ్ అనుభవం, స్థానిక కంటెంట్ కార్యక్రమాలు, భాగస్వా మ్యాలు, స్పాట్లైట్, స్టోరీస్ తో ప్రాంతీయ సృష్టికర్తలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా స్నాప్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది. ఇవన్నీ స్నాప్ ఈ మైలురాయిని చేరుకోవడంలో సహాయ పడ్డాయి. స్థానిక వినియోగదారులకు ఔచిత్యాన్ని నిర్ధారించడం అనేది భారతదేశంలో స్నాప్ చాట్ కు చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు 120 మిలియన్లకు పైగా భారతీయ స్నాప్చాటర్లు యాప్లోని నాల్గవ, ఐదవ ట్యాబ్లైన స్టో రీస్, స్పాట్లైట్లో కంటెంట్ను చూస్తున్నారు. స్నాప్ చాట్ వినియోగదారులు సృష్టించిన వినోద ప్లాట్ఫామ్ అయిన స్పాట్లైట్, భారతదేశంలో యూజర్లు స్పాట్లైట్లో గడిపిన సమయాన్ని మూడు రెట్లు ఎక్కువ చేయడంతో గణనీయమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ఈ బలమైన ఎంగేజ్ మెంట్ కొత్తతరం సృష్టికర్తలకు స్నాప్ చాట్ ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సాధికారతను కల్పిస్తోంది. ఏపీఏసీ స్నాప్ ఇన్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ "మన భారతీయ కమ్యూనిటీలో ఊపందుకుంటున్న సమయంలో నేను స్నాప్లో చేరినందుకు థ్రిల్గా ఉన్నాను. స్నాప్చాట్లో కమ్యూనిటీలు, వ్యాపారాలను నిర్మించడానికి భాగస్వాములు, సృష్టికర్తలు, బ్రాండ్లకు అద్భుతమైన సంభావ్య తను మేం చూస్తున్నాం. మా భవిష్యత్తు గురించి మేం మరింత ఉత్సాహంగా ఉన్నాం. యంగ్ ఇండియా ముఖ్యంగా ఆరోగ్యకరమైన, ప్రైవేట్ వాతావరణాన్ని విలువైనదిగా పరిగణిస్తుంది. ఇది మాకు బాగా తెలుసు. దాన్ని కేంద్రంగా చేసుకునే ముందుకు కొనసాగుతాం'' అని అన్నారు.
0 Comments