భారత్లో ల్యాండ్రోవర్ ఇండియా సరికొత్త
రేంజ్ రోవర్ ఎవోక్ కారును ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ మోడల్
ఎక్స్షోరూమ్ ధర రూ.64.12లక్షలుగా కంపెనీ పేర్కొంది. పెట్రోల్ వెర్షన్
ఆర్ డైనమిక్ ఎస్ఈ ట్రిమ్లో కూడా ఈ కారు లభిస్తుంది. డీజిల్ వెర్షన్
కేవలం ఎస్ట్రిమ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 2.0 లీటర్
ఇన్జీనియమ్ శ్రేణి పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అమర్చారు. ఈ కారు విడుదల
సందర్భంగా కంపెనీ ఎండీ రోహిత్ సూరి మాట్లాడుతూ..‘‘ఎవోక్ మోడల్
ప్రత్యేకమైన,ఆధునిక డిజైన్తో చూపులు తిప్పుకోనివ్వదు. కొత్త ఇంటిరీయర్
కలర్ వే, ఆధునిక ల్యాండ్ రోవర్ సాంకేతికతలు, ఇన్జీనియమ్ పవర్ ట్రైన్
మరింత శక్తిని సమకూరుస్తాయి’’ అని పేర్కొన్నారు. ఈ కారులో 3డీ సరౌండింగ్ కెమెరా, పీఎం.2.5 ఫిల్టర్తో క్యాబిన్ ఎయిర్
అయానైజేషన్, వైర్లెస్ ఛార్జింగ్, ఫోన్ సిగ్నల్ బూస్టర్, సరికొత్త
పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్యాబిన్లో డ్యూయల్ టోన్ కలర్
స్కీం వంటి ఆకర్షణలు ఉన్నాయి. దీనిలో 2.0 లీటర్ ఇంజీనియమ్
పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 247 బీహెచ్పీ శక్తిని, 365 పీక్
టార్క్ను ఇస్తుంది. 2.0లీటర్ ఇంజిన్ 201 బీహెచ్పీ శక్తి, 430 పీక్
టార్క్ను అందిస్తుంది. రెండు ఇంజిన్లకు 9స్పీడ్ ఆటోమేటిక్
ట్రాన్స్మిషన్ అమర్చారు. ల్యాండ్ రోవర్ అత్యధికంగా విక్రయించే
మోడల్స్లో ఎవోక్ ఒకటి.
0 Comments