Ad Code

తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో బర్త్ డేలు.....!

 

భారతీయ రైల్వేలో నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎవరైనా సరే బర్త్ డేలను చేసుకోవచ్చు.  లక్కీ డ్రా కూడా నిర్వహిస్తారు. అందులో విజేతలకు బహుమతులను కూడా అందజేస్తారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్న ఈ ఆఫర్‌పై ఐఆర్‌సీటీసీ ట్వీట్ ద్వారా వివరాలను వెల్లడించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తారు. కాగా దేశంలోనే మొదటి ప్రయివేటు రైలుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుగాంచింది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారతీయ రైల్వేలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను తేజస్ రైలులో అందిస్తున్నారు.

బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేవారు ముందుగా తేదీ, సమయంతో బుక్ చేసుకోవాలి. ఒక రోజుకు 13 మందికి మాత్రమే ఇందుకు అనుమతిస్తారు. ఏరోజు కారోజు 13 మంది పేర్లతో డ్రా తీస్తారు. విజేతలకు బహుమతులను ఇస్తారు. ఐఆర్‌సీటీసీ సైట్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు బుక్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu