వినియోగదారులకు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అదిరిపోయే ఆఫర్ను ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీలకు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అందిస్తోంది. ఇలా అందించే సర్వీస్లను రేడియో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ అని అంటారు. ఈ కనెక్షన్కు అర్హత కలిగిన ఫ్రాంచైజీలకు ఉచితం కనెక్షన్ ఇస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ టెల్కో 40 ఎంబిపిఎస్ ప్లాన్ను కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ ఆఫర్కు అర్హత పొందడానికి భారత్ ఎయిర్ ఫైబర్ ఫ్రాంచైజీలు కనీసం 50 ఎఫ్ టి టి హెచ్ కనెక్షన్లను అందించాలి. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ ఫ్ టి టి హెచ్ కనెక్షన్లను అందించిన ఫ్రాంచైజీ ఉంటే వారికి ఈ ఆఫర్కు వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రకారం ముందుగా బీఎస్ఎన్ఎల్ ఎయిర్ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్తో భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్, ఉచిత డెమో లభిస్తుంది. దీని వేగం సుమారు 40 ఎంబిపిఎస్ ఉంటుంది. రూ.699లతో కనీసం 50 బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను ఎయిర్ ఫైబర్ భాగస్వామికి చెందిన ప్రతీ కార్యాలయానికి అందిస్తుంది. ఈ డెమో కనెక్షన్ను బీఎస్ఎన్ఎల్ ఫ్రాంఛైజీలు మాత్రమే వినియోగించుకోవాలి. ఇతరులు వినియోగించుకోకూడదు. ఫ్రాంఛైజీలు డెమో కనెక్షన్నుఎవరికీ విక్రయించడానికి అనుమతి లేదు. డెమో కనెక్షన్ కోసం బీఎస్ఎన్ఎల్ ఎటువంటి బిల్లులను జారీ చేయదు.
0 Comments