Ad Code

క్రికెట్‌ కు మలింగ గుడ్ బై



శ్రీలంక క్రికెట్‌ జట్టు దిగ్గజ క్రికెటర్‌ మరియు యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ తన అంతర్జాతీయ క్రికెట్‌ కు ముగింపు పలికాడు. క్రికెట్‌ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తన సోషల్‌ మీడియా వేదికగా లసిత్‌ మలింగ్‌ స్పష్టం చేశారు. తాను క్రికెట్‌ ఆడకున్నా… ఆట పై ప్రేమ అలాగే ఉంటుందని తెలిపారు ఆ ఆట కోసం మరింత కృషి చేస్తానని ప్రకటించాడు. 17 సంవత్సరాల క్రికెట్‌ అనుభవం తో యువ క్రికెటర్ల కు పాఠాలు చెబుతానని స్పష్టం చేశాడు. లసిత్‌ మలింగ తన అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్ర లో ఇప్పటి వరకు ఏకంగా 30 టెస్ట్‌ లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్‌ లు మరియు 122 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ లు ఆడాడు. ఇప్పటి వరకు 500 పైగా వికెట్లు పడగొట్టాడు. 

Post a Comment

0 Comments

Close Menu