Ad Code

భూమికి తిరిగొచ్చిన చైనీస్ వ్యోమగాములు


ముగ్గురు చైనీస్ వ్యోమగాములు నీయ్ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హోంగ్బో 90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా భూమికి తిరిగొచ్ఛినట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) తెలిపింది. షెంఝౌ 12 మ్యాన్డ్ స్పేస్‌షిప్ రిటర్న్ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లో, డోంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌ దగ్గరకు భూమికి చేరుకుంది. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం ఇది. చైనీయులు దిగువ భూ కక్ష్యలో సుదీర్ఘకాలం ఉండటం ఇదే తొలిసారి.

Post a Comment

0 Comments

Close Menu