కరోనా కష్టకాలంలో ఎంతో మందికి కడుపు నింపిన ఉచిత రేషన్ను ఇక నుంచి ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో గతేడాది మార్చి నుంచి అందిస్తున్న ఉచిత రేషన్ను నవంబర్ 30 తర్వాత పొడిగించబోమని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా అర్హులైన 80 కోట్లకు పైగా మంది ప్రజలు నెలకు 5కేజీల చొప్పున బియ్యం/ గోధుమలు, కుటుంబానికి ఒక కేజీ శనిగలు లను ప్రభుత్వం ఉచితంగా అందించింది.
0 Comments