Ad Code

భారత్‌లో రెడ్‌మీ నోట్ 11ఎస్‌ ఫిబ్రవరి 9న లాంచ్!


జియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచ్ డేట్‌ను రెడ్‌మీ తాజాగా ఫిక్స్ చేసింది. భారత్‌లో ఫిబ్రవరి 9న లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో హైఎండ్ ఫీచర్లు ఉండనున్నాయి. అందులో ముఖ్యమైనది 108 ఎంపీ రేర్ కెమెరా. ఈ ఫోన్ క్వాడ్ రేర్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉండనుంది. రెడ్‌మీ నోట్ 11 మోడల్స్‌ను గత సంవత్సరమే చైనాలో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 11 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు జియోమీ కసరత్తు చేస్తోంది. 108 ఎంపీ సామ్‌సంగ్ ఐఎస్‌వో సెల్ హెచ్ఎం2 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 355 సెన్సార్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ లాంటి ఫీచర్లతో 11ఎస్ రానుంది. జనవరి 26న రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా జియోమీ లాంచ్ చేయనుంది. అందులో భాగంగా రెడ్‌మీ నోట్ 11 4జీ, రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్లు విడుదల కానున్నాయి. అయితే.. గత సంవత్సరం చైనాలో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌కు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఫోన్ల ఫీచర్లలో తేడా ఉండనున్నట్టు తెలుస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu