Ad Code

స్వల్పకాలకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై వడ్డీరేట్ల పెంపు!


స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్లు అంటే 0.1 శాతం పెంచింది. కాలపరిమితి 1-2 ఏళ్ల మధ్య ఉన్న రూ.రెండు కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు ను 5 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. ఇవి నేటి (జనవరి 15, 2022) నుంచే అమల్లోకి రానున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే కేటగిరీలోని సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటును 5.5 శాతం నుంచి 5.6 శాతానికి పెంచారు. గత ఏడాది డిసెంబరులోనే బేస్‌ రేటును ఎస్‌బీఐ 0.10 శాతం పెంచడంతో అది సంవత్సరానికి 7.55 శాతానికి చేరింది. డిసెంబరు 15, 2021 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తక్కువ వడ్డీరేట్లకు ఇక సమయం ముగిసిందనడానికి ఇది సంకేతం అని బ్యాంకింగ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోన్లు ఇచ్చేందుకు బేస్‌ రేట్‌ను ఆధారంగా తీసుకుంటారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్ల ట్రెండ్‌ను కూడా ఇది సూచిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బేస్‌ రేటు పెరగడంతో త్వరలో మరిన్ని వడ్డీరేట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరాయి. దీంతో ఈ కేటగిరీలో ఇన్వెస్ట్‌ చేసినవారు చాలా తక్కువ రాబడి పొందుతున్నారు. అలాంటి వారికి తాజా వడ్డీరేట్ల పెంపు శుభవార్తనే చెప్పాలి!

Post a Comment

0 Comments

Close Menu