Ad Code

కియా కారెన్స్‌ కార్ల బుకింగ్‌ షురూ!


కియా మోటార్స్‌ భారత్‌లో తన సరికొత్త మోడల్‌ కారెన్స్‌ బుకింగ్‌ జనవరి 14 నుంచి  ప్రారంభించింది. కంపెనీ నుంచి వస్తున్న నాలుగో మోడల్‌ కారు ఇది. 2022లో మార్కెట్లో విడుదలయ్యే కార్లలో మొదటిది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను ఉన్నాయి. కియా కారెన్స్‌ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు 6 నుంచి 7 సీట్లు కలిగి ఉంటుంది. అలాగే ఎంపీవీ ముందు భాగంలో టైగర్‌ నోస్‌ గ్రిల్‌, వెనుక భాగంలో సెపరేటింగ్‌ లైన్ కూడా చూడవచ్చు. కియా కొత్తగా మార్కెట్లోకి తీసువస్తున్న ఈ కారు వరుసగా మూడు సీట్లతో ఉంటుంది. ఈ కారు ఐదు విభాగాలలో లభించనుంది. ప్రీమియం, ప్రెస్టేజ్‌, ప్రెస్టేజ్‌ ప్లస్‌, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు1.5 పెట్రోలు, 1.4పెట్రోలు, 1.5డీజిల్‌ ఇంజిన్‌, 6ఎంటీ, 7డీసీటీ, 6ఏటీ ఆప్షన్లు ఉన్నాయి. బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌ ద్వారా ముందస్తుగా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి.  అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu