“కియా కారెన్స్” పేరుతో కియా ఇండియా సరికొత్త ఫీచర్స్ తో మరో నూతన కారును ఆవిష్కరించింది. భారతదేశంలో ప్రారంభించిన నాల్గవ కియా మోడల్ ఇది. ఈ కారు సిక్స్ సీటర్స్ ,సెవెన్ సీటర్స్ రెండు రకాల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. కియా ఇండియా ఇంతకుముందు సెల్టోస్, కార్నివాల్, సోనెట్ వంటి మోడల్స్ ను విడుదల చేసింది. కియా కారెన్స్… స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, డీఆర్ఎల్స్, వంటి ఫీచర్లతో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వంటి ఐదు ట్రిమ్స్లో కియా కారెన్స్ అందుబాటులో ఉంది. ఆరు ఎయిర్బ్యాగ్లు, డౌన్హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, 10.25 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, సింగిల్ పేన్ సన్రూఫ్, ఎయిర్ ప్యూరిఫైర్, బాస్ స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా ఇండియా క్యారెన్స్ (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. జనవరి 14 నుంచి బుకింగ్లు ప్రారంభమవ్వగా ఒక్క నెలలోనే దాదాపు 20వేల బుకింగ్లు జరిగాయి.
0 Comments