అక్టోబర్ 1 నుండి రహదారి భద్రత కు సంబంధించిన ఈ నియమ నిబంధనలు అమలులోకి వస్తాయని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం ఎయిర్ బ్యాగ్స్ల సంఖ్య పెంచడంతో కార్ల కంపెనీలు కార్ల ధరలను కూడా పెంచుతాయి. భారతదేశంలో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ముఖ్యమైనది. ఇది పెద్ద కార్లలో 6 ఎయిర్ బ్యాగ్లతో వాహనాలు ఉండనున్నాయి. ఇలా ఎయిర్బ్యాగ్స్ అన్ని సీట్లకు ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారంత సురక్షితంగా బయటపడవచ్చు. 8 సీట్ల వాహనాల్లో 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనకు ఇటీవల ఆమోదం లభించింది. అన్ని ప్యాసింజర్ వాహనాలకు కనీసం రెండు ఎయిర్ బ్యాగ్లు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది. డ్రైవర్కు ఎయిర్బ్యాగ్ తప్పనిసరి చేస్తూ జూలై 2019 నుండి అమలు చేయబడింది. అయితే జనవరి 1, 2022 నుండి ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు ఇది తప్పనిసరి చేయబడింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో కేంద్ర రవాణా శాఖ మరో నాలుగు ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేసింది. వెనుక సీట్లలో రెండు ఎయిర్బ్యాగ్లు, రెండు ట్యూబ్ ఎయిర్బ్యాగ్లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా ఇదొక ముందడుగు అని గడ్కరీ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో హైవేపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఇందులో 47,984 మంది మరణించారు.
0 Comments