Ad Code

జియో T20 ధన్ ధనా ధన్ ఆఫర్ !


రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా రెండు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యూజర్లు ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌ను ఉచితంగా చూసేందుకు వీలుగా రెండు కొత్త మొబిలిటీ ప్లాన్‌లను ప్రారంభించింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) భాగస్వామ్యంతో రూ. 555 రూ. 2999 ధరలతో సరసమైన ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో T20 ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఈ ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు సరికొత్త ప్లాన్లు, రివార్డ్‌లు అఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటే చాలు ఎలాంటి అదనపు రీఛార్జ్ చేయకుండానే Disney+ Hotstar సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త రూ. 555 రూ. 2999 ప్లాన్‌లు జియో ప్రస్తుత క్రికెట్ ప్లాన్‌ల జాబితాకు యాడ్ ఆన్ ప్లాన్లుగా అందిస్తోంది. ఇప్పటి వరకూ జియో అందించే క్రికెట్ ప్లాన్ల జాబితాలోని చౌకైన ప్లాన్ ధర రూ. 499 నుంచి రూ. 3119 వరకు అందిస్తోంది. అయితే ఈ కొత్త రూ. 555, రూ. 2999 ప్లాన్‌లను గత 28 రోజులుగా ఏదైనా జియో యాక్టివ్ ప్లాన్‌లో కొనసాగుతున్న యూజర్లు మాత్రమే పొందే అవకాశం ఉంది. జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 555 జియో ప్లాన్ ప్రాథమికంగా డేటా-ఆన్ ప్లాన్ అందిస్తోంది. అంటే మీ ప్రస్తుత ప్లాన్‌‍పై అదనపు డేటాను అందిస్తుంది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లపై వాయిస్ కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ పొందలేరు. జియో ఈ ప్లాన్లను ప్రధానంగా జియో ఐపీఎల్ క్రికెట్ వీక్షించే యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లను పొందాలంటే ముందుగా మీరు ఇదివరకే ఏదైనా క్రికెట్ ప్లాన్ లో ఉండాలి. అప్పుడే ఈ యాడ్ ఆన్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu